/rtv/media/media_files/2025/04/24/Ql9spKlxb2H7w6kS9v0g.jpg)
Pahalgam Terror Attack
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనకు పాల్పడ్డ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులను చట్టం ముందుకు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు పహల్గాం అడువుల్లోని పర్యాటక స్థలానికి చేరుకొని కాల్పులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అయితే వీళ్లు ఆ ప్రదేశానికి చేరుకునేందుకు ఆల్పైన్ క్వెస్ట్ అనే అప్లికేషన్ను వినియోగించినట్లు ఇంటెలిజెన్స్ భద్రతా వర్గాలు తెలిపాయి.
Also Read: జమ్మూకశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. ఓ జవాన్ మృతి
గతంలో కూడా జమ్మూ అడవుల్లో దాడులు చేసందుకు ఉగ్రవాదులు ఈ యాప్ను వినియోగించారు. ఇప్పుడు కూడా ఈ యాప్ ద్వారానే రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశానికి ఉగ్రవాదులు చేరుకున్నారు. భారత నిఘా సంస్థల ట్రాకింగ్ను నివారించేందుకు, పాక్ సైన్యం మద్దతుతోనే ఈ యాప్ను రూపొందించారు. అనంతరం ఈ యాప్ను ఎలా వినియోగించాలనే దానిపై ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాతే పక్కా ప్లాన్తో ఈ ఉగ్రఘాతుకానికి పాల్పడ్డారు.
Also Read: నీళ్ల నుంచి వ్యాపారం వరకు.. భారత్ నిర్ణయంతో పాక్ కు చుక్కలే.. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటే?
మంగళవార మధ్యాహ్నం పహల్గాంలోని మినీ స్విట్జర్లాండ్గా గుర్తింపు తెచ్చుకున్న బైసరన్లో టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడి జరిగిన అనంతరం కేంద్రం ప్రభుత్వం కూడా ప్రతీకారంగా పాకిస్థాన్పై సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును వెంటనే నిలిపివేస్తూట్లు ప్రకటించింది. అలాగే భారత్, పాక్ మధ్య రాకపోకల కోసం ఉండే అట్టారీ చెక్ పోస్ట్ మూసివేయడం, పాకీస్థానీయులకు వీసాలను నిషేధించడం లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంది.
Also Read: పాకిస్థాన్కు మరో బిగ్ షాక్.. ఆ దేశ 'ఎక్స్' అకౌంట్ బ్లాక్..
telugu-news | rtv-news