/rtv/media/media_files/2025/04/27/mrszKO0LcDVzqDZgRF8A.jpg)
Maoists bunker
Chhattisgarh: కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రె గుట్టల్లో కీలక అడుగు ముందుకుపడింది. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్ ను గుర్తించారు. మావోయిస్టుల కంచుకోట అయినా కర్రెగుట్టల్లో నక్సలైట్ల భారీ బంకర్ను భద్రతా దళాలు గుర్తించాయి. దాదాపు వెయ్యి మంది ఉండేలా నిర్మించిన భారీ గుహను భద్రత దళాలు కనిపెట్టాయి. ఈ గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్లు గుర్తించారు. భద్రతా బలగాల రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. కాగా కర్రెగుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గుహ విజువల్స్ను భద్రతా బలగాలు విడుదల చేశాయి.
Also Read: గుజరాత్లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!
ఇలాంటి గుహలు కర్రె గుట్టల్లో అనేకం ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ను కంటిన్యూ చేస్తున్నాయి. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య పరస్పర కాల్పులతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి. తుపాకీ తూటాల మోతతో కర్రెగుట్టల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతున్నారు.
Also Read: BSF jawan : 80 గంటలు, 3 సమావేశాలు.. BSF జవాన్ ఎక్కడ.. పాక్ ఆర్మీ అతన్ని ఏం చేసింది?
2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇందు కోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు మరో వెయ్యి మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు మరో వెయ్యి మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో కర్రెగుట్టలో ఐదు రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర మూడు వైపుల నుంచి కర్రెగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. హిడ్మాతో పాటు మరికొందరు కీలక నేతలే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మవోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులతో కర్రెగుట్టలు తుటాల మోతతో దద్దరిల్లుతున్నాయి.
ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్ఎఫ్ యూ టర్న్
శనివారం భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 28 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. దీనిపై అధికారులు, ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఛత్తీస్గడ్, తెలంగాణా సరిహద్దు కర్రెగుట్టల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. కాగా కర్రెగుట్టలో మర్ని డంపులు, మావోయిస్టుల రహస్య స్థావరాలు, ప్రింటింగ్ ప్రెస్తో పాటు గుట్టల్లో వైద్య విభాగం కూడా పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కర్రెగుట్టలు భద్రతా దళాలలకు చిక్కితే తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంత మావోయిస్టులు కీలక స్థావరాన్ని కోల్పొయినట్లే ననే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మావోయిస్టులు ఇప్పటికే మూడు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. కేవలం ఆఫరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయని పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. నక్సల్స్ ఏరివేత పేరుతో మానవ హత్యలకు పాల్పడటం సరికాదని వారంటున్నారు.
Also Read: గుజరాత్లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!
ఇక ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో కర్రెగుట్టలో ఆపరేషన్ చేపట్టిన కేంద్ర బలగాలు నీరసించిపోతున్నాయి. కర్రెగుట్టల మధ్యన భారీ అడవుల్లో నీరు దొరకక భద్రత దళాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి నడక ఒకవైపు.. చెమటలు, ఉక్కబోతతో ఇబ్బందులకు గురవుతున్న జవాన్లు డీహైడ్రేషన్కు గురవుతున్నట్లు సమాచారం. తెలంగాణ వైపు నుంచి హెలికాప్టర్ ద్వారా బలగాలకు నిత్యావసర వస్తువులు, తాగునీరు, ఇతర సామగ్రిని ఎప్పటికప్పుడు పంపుతున్నా.. ఛత్తీస్గఢ్ వైపు ఆ తరహా సరఫరాకూ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఎండ వేడి. తాగేందుకు నీరు లేకపోవడంతో చాలా మంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు.