Pahalgam Terror Attack : టూరిస్టులకు షాక్...ఆ ప్రాంతాలు మూసివేత

పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కశ్మీర్ లోయలో ఉన్న మొత్తం 87 ప్రదేశాల్లోని 48 టూరిస్ట్ ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కశ్మీర్ లోయలో ఉన్న మొత్తం 87 ప్రదేశాల్లోని 48 టూరిస్ట్ ప్రాంతాల  ను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది. ఇక మూసివేయబడిన టూరిస్ట్ ప్రాంతాల్లో త్వరలో సెక్యూరిటీని కల్పించనున్నారు. మరోవైపు సరిహద్దులో దాయది పాకిస్థాన్  కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఇవాళ తెల్లవారుజామున అక్నూర్ సెక్టార్‌ లో పాక్ రేంజర్లు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. శ్రీనగర్ విమానాశ్రయానికి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గింది. అనుమానిత ఇళ్లపై దాడులు రెండవ వారం కూడా కొనసాగుతున్నాయి.

Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ

Pahalgam Terror Attack

మూసివేయబడిన ప్రాంతాలు: యూస్‌మార్గ్, తౌసిమైదాన్, దూద్‌పత్రి, అహర్‌బల్, కౌసర్‌నాగ్, బంగస్, కరివాన్ డైవర్ చండీగమ్, బంగస్ వ్యాలీ, వులర్/వాట్లాబ్, రాంపోరా మరియు రాజ్‌పోరా, చీర్‌హార్, ముండిజ్-హమ్‌టాప్, విందీజ్-హమ్‌టాప్, సన్ టెంపుల్, వెరినాగ్ గార్డెన్, సింథన్ టాప్, మార్గన్‌టాప్, అకాద్ పార్క్, హబ్బా ఖాటూన్ పాయింట్, బాబారేషి, రింగావాలి, గోగల్‌దారా, బదర్‌కోట్, ష్రూంజ్ జలపాతం, కమాన్‌పోస్ట్, నాంబ్లాన్ జలపాతం, ఎకో పార్క్ ఖడ్నియార్, సంగర్వాణి, జామియా మసీదు, రాజనాజ్ కదల్వారీ, కదల్వారీ, రాజ్‌నాజ్ కదల్వారీ హోటల్ ఐవరీ హోటల్, పద్షాపాల్ రిసార్ట్స్ అండ్‌ రెస్టారెంట్, చెర్రీ ట్రీ రిసార్ట్ (ఫకర్ గుజ్రి), నార్త్ క్లిఫ్ కేఫ్ మరియు రిట్రీట్ బై స్టే ప్యాటర్న్, ఫారెస్ట్ హిల్ కాటేజ్, ఎకో విలేజ్ రిసార్ట్ (దారా), అస్తాన్‌మార్గ్ వ్యూ పాయింట్, అస్తాన్‌మార్గ్ పారాగ్లైడింగ్, మమ్నేత్ అండ్‌ మహాదేవ్ హిల్స్, బౌద్ధ విహారం,, దచిగామ్ - ట్రౌట్ ఫామ్ / ఫిషరీస్ ఫామ్ బియాండ్, అస్తాన్‌పోరా (ముఖ్యంగా ఖయామ్ గహ్ రిసార్ట్, లచ్‌పత్రి, హంగ్ పార్క్ , నరనాగ్ తదితర ప్రాంతాలకు భద్రత కల్పించబడింది.  వీటిలో కొన్ని గమ్యస్థానాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.కాగా పహల్గామ్ దాడి తర్వాత శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల రద్దీ బాగా తగ్గింది.

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
 
నిషేధిత ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై నిరంతర చర్యలు కొనసాగిస్తూ,  చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదైన కేసుల దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడంలో, శ్రీనగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలను కూల్చివేయాలనే లక్ష్యంతో నగరంలోని పలు ప్రదేశాలలో సోదాలు కొనసాగించారు. శ్రీనగర్ అంతటా 34 మంది అనుమానితుల ఇళ్లపై దాడి చేశారు, ఇప్పటివరకు కాశ్మీర్ అంతటా 1000 మంది ఇళ్లలో సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు."శ్రీనగర్ పోలీసులు నగరంలో శాంతి భద్రతలను కాపాడటానికి కట్టుబడి ఉన్నారు. హింస, అంతరాయం లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ఏ వ్యక్తి అయినా చట్టం ప్రకారం కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటారు." అని పోలీసులు హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు

Tourist Places | tourist | attack in Pahalgam | jammu kashmir terror attack

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు