/rtv/media/media_files/2025/05/07/933PA0yFLRWySKVoEWql.jpg)
15 civilians killed, 43 injured in Pakistan Attack
సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంబడి గత కొన్నిరోజులుగా పాకిస్థాన్ కాల్పులకు పాల్పడుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఇలాంటి దాడులకు దిగుతుంది. అయితే మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట వైమానిక దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 9 ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడింది. ఆ తర్వాత పాకిస్థాన్ రేంజర్లు కూడా బుధవారం విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు.
Also Read: వెన్నులో వణుకుపుట్టించే ఆపరేషన్ సిందూర్ లైవ్ వీడియోస్.. చూస్తే గజగజ!
ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారని ఇండియన్ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది. అలాగే మరో 43 మంది గాయపడినట్లు పేర్కొంది. తంగ్ధర్, పూంఛ్ సెక్టార్ మంగళవారం రాత్రి నుంచి పాకిస్థాన్ బలగాల కాల్పులు జరుగుతున్నాయని తెలిపింది.
ఇక ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ చేపట్టిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడులకు ప్రతీకారంగానే భారత్.. తాజాగా పాక్, POKలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.
Also Read: ఎవరీ మసూద్ అజార్.. జైషే మహ్మద్ మాస్టర్ మైండ్ రహస్యాలివే..!
మరోవైపు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ తదనంతరం తీసుకునే చర్యల గురించి ఆయా పార్టీల నేతలకు కేంద్రం వివరించనుంది. అలాగే దేశభద్రతకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తదితరులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పాకిస్థాన్పై చేపట్టిన మెరుపుదాడులను విపక్ష పార్టీల నేతలు కూడా స్వాగతించారు. పాక్ ఉగ్రచర్యలకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే నిర్ణయాలకు తాము సపోర్ట్ చేస్తామన్నారు.
Also Read: 'పాక్ను ఓడించండి' అన్నందుకు కత్తితో దాడి.. బాలుడిని దారుణంగా పొడిచి!
operation Sindoor | operation sindoor air strike | rtv-news