/rtv/media/media_files/2025/02/01/zJDk39nZJqJPIoqB4XBZ.jpg)
Blood Pressure
Blood Pressure: చెడు జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే రక్తపోటు సమస్యకు గురవుతున్నారు. అందుకే ఈ రోజుల్లో యువత కూడా బీపీ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. రక్తపోటు పెరిగితే అది గుండెతో పాటు మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది స్ట్రోక్, గుండెపోటు వంటి తీవ్రమైన వైద్య పరిస్థితులకు దారి తీస్తుంది. కాబట్టి రక్తపోటు ఎక్కువగా ఉంటే వెంటనే శ్రద్ధ వహించాలి. బీపీ పెరిగే లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు, తక్షణ ఉపశమనం కోసం చర్యలు తీసుకోవాలని, లేకుంటే రోగి ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. రక్తపోటు పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
తక్షణ ఉపశమనం:
ఎవరికైనా రక్తపోటు ఎక్కువగా ఉంటే వ్యక్తిని ఫ్యాన్ గాలిలో హాయిగా ఉంచాలి. చుట్టూ గుమికూడ వద్దు. అప్పుడు లోతైన శ్వాస తీసుకోమని చెప్పాలి. సాధారణ నీరు ఇవ్వాలి, ఒకేసారి నీరు తాగకుండా సిప్ చేయాలి. దీంతో తక్షణ ఉపశమనం కలుగుతుంది. అరటి, కివీ, యాపిల్ తినడం వల్ల అధిక బీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది. రక్తపోటు పెరిగితే ముందుగా రోగికి ఈ పండ్లలో ఒకదాన్ని తినడానికి ఇవ్వండి. ఇది బీపీని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. బ్లడ్ ప్రెజర్ పెరిగితే లెమన్ వాటర్ తాగడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.
అందులో ఉప్పు, పంచదార వేయకూడదు. రెండు గ్లాసుల నీరు తాగాలి. కొన్నిసార్లు బహిరంగ ప్రదేశంలో తేలికగా నడవాలి. అధిక రక్తపోటుతో బాధపడుతుంటే ప్రతిరోజూ ఉదయం ఒక చిన్న నడక అవసరం. దినచర్యలో యోగాచ ఏరోబిక్స్ వ్యాయామాలను చేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురిచేసే అలవాటును మానుకోవడం మంచిది. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, సలాడ్లు వంటి తేలికపాటి ఆహారాన్ని తినాలి. వీటిలో నూనె తక్కువగా వాడాలి. బీపీని తనిఖీ చేస్తూ ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఎముకలు, దంతాలకు నువ్వులు వరం.. ఎన్నో సమస్యలు మాయం