Lakshmi Devi Prasadam: శుక్రవారం ఈ నైవేద్యాలు పెడితే అమ్మవారికి కోపం వస్తుంది

హిందూమతంలో శుక్రవారం రోజున లక్ష్మిలను పూజించి ఉపవాసం ఉండే సంప్రదాయం ఆచారంగా వస్తోంది. శుక్రవారం లక్ష్మీదేవి పూజలో పొరపాటున కూడా తులసి, పుల్లని పండ్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసిన ఏ ఆహారాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారికి కోపం వస్తుంది.

New Update
Lakshmi Devi Prasadam

Lakshmi Devi Prasadam

Lakshmi Devi Prasadam: హిందూమతంలో శుక్రవారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి, సంతోషి మాత, దుర్గాదేవి, వైభవ లక్ష్మిలను పూజించి ఉపవాసం ఉండే సంప్రదాయం ఆచారంగా వస్తోంది. శక్తి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. శుక్రవారాల్లో దేవతను ప్రసన్నం చేసుకోవడానికి స్వీట్లు, పండ్లు, ఖీర్ వంటి అనేక వస్తువులను నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ శుక్రవారం నాడు నైవేద్యం పెట్టకుండా ఉండవలసిన కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఇలాంటివి సమర్పిస్తే  పూజా ఫలాలను సక్రమంగా పొందలేరని పండితులు చెబుతున్నారు.  ఆ నైవేద్యాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

పుల్లనివి పెడితే అమ్మ ఆగ్రహానికి..

శుక్రవారం లక్ష్మీదేవి పూజలో పొరపాటున కూడా తులసిని ఉపయోగించవద్దు. ఎందుకంటే లక్ష్మీదేవికి తులసిని సమర్పిస్తే అమ్మవారికి కోపం వస్తుంది. అందుకే లక్ష్మీదేవి పూజలో తులసిని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్పించరు. శుక్రవారం నాడు సంతోషి తల్లిని పూజించే సంప్రదాయం ఉంది. కానీ పూజ విషయంలో ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సంతోషి మాతకు ఎప్పుడూ పుల్లని పండ్లను సమర్పించకూడదు. శుక్రవారం పుల్లని వాటిని తినకూడదని, పుల్లనివి పెడితే అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?

దీనితో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసిన ఏ ఆహారాన్ని కూడా నైవేద్యంగా అందించవద్దు. వెల్లుల్లి, ఉల్లిపాయలతో చేసిన ప్రసాదాన్ని తామసికంగా భావిస్తారు. కాబట్టి పూజలో ఉపయోగించరు. అలాగే పూజ సమయంలో ఉప్పుతో కూడిన నైవేద్యాలను సమర్పించకూడదు. శుక్రవారం నాడు లక్ష్మీ దేవికి ఖీర్ నివేదన చేస్తారు. కానీ ఖీర్ స్వచ్ఛంగా, తాజాగా ఉండాలని గుర్తుంచుకోవాలి. దుర్వాసన వచ్చే లేదా కలుషితమైన వస్తువులను నైవేద్యం పెట్టడం వల్ల పూజ ఫలించదు. కాబట్టి స్నానం చేసిన తర్వాతే స్వచ్ఛమైన పద్ధతిలో నైవేద్యం సిద్ధం చేయాలని, ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: రసాయనాలతో పండించిన మామిడిని ఎలా గుర్తించాలి?

( puja | lakshmi-devi | lakshmi devi puja | latest-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు