Kailash Yatra: మానస సరోవరం యాత్రపై చైనా కీలక అప్‌డేట్‌

2025లో చైనా-భారత్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ యాత్రకు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ యాత్ర 2025 జూన్‌లో ప్రారంభం కానుంది. అధికారిక ప్రక్రియను కంప్యూటరీకరించిన కారణంగా దరఖాస్తు ప్రక్రియ kmy.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

New Update
Kailash Yatra

Kailash Yatra

Kailash Yatra: కైలాస మానస సరోవరం యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఐదు సంవత్సరాల విరామం తర్వాత 2025లో ఈ పవిత్ర యాత్ర జరగబోతోంది. హిందూ, బౌద్ధ మతాలలో కైలాస పర్వతం, మానస సరోవరం అత్యంత పవిత్రమైన స్థలాలుగా భావిస్తారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020లో ఈ యాత్రను నిలిపివేశారు. కానీ ఇప్పుడు భారత్, చైనా దేశాలు సంయుక్తంగా ఈ యాత్రను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాయి.  2025లో చైనా-భారత్ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ యాత్రకు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ యాత్ర 2025 జూన్‌లో ప్రారంభం కానుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా ఐదు బృందాలు ప్రయాణిస్తాయి. 

కైలాస మానస సరోవరం యాత్ర:

ప్రతి బృందంలో 50 మంది యాత్రికులు ఉంటారు. అలాగే సిక్కింలోని నాథులా పాస్ మార్గం ద్వారా మరో పది బృందాలు ప్రయాణిస్తాయి. మొత్తంగా 750 మంది యాత్రికులు ఈ యాత్రలో పాల్గొననున్నారు. భౌగోళికంగా కఠినమైన ఈ యాత్రకు ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం. అధికారిక ప్రక్రియను కంప్యూటరీకరించిన కారణంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఇందుకోసం kmy.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దరఖాస్తుదారులు ఇక లేఖలు, ఫ్యాక్స్‌లు పంపాల్సిన అవసరం లేదు. అవసరమైన సమాచారాన్ని వెబ్‌సైట్‌లోనే పొందవచ్చు. ఫీడ్‌ బ్యాక్ ఆప్షన్ ద్వారా ప్రశ్నలు పంపడం లేదా సూచనలు ఇవ్వడం కూడా సాధ్యమే అంటున్నారు. కైలాస మానస సరోవరం యాత్రను పునఃప్రారంభించేందుకు భారత్-చైనా మధ్య ఇప్పటికే అనేక సమావేశాలు జరిగాయి. 

ఇది కూడా చదవండి: వేసవిలో ఈ రంగు బట్టలు వేసుకుంటే కూల్‌గా ఉంటుంది

2025 జనవరిలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా ఉప విదేశాంగ మంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు అంగీకారం తెలిపారు. అంతకు ముందు 2024 అక్టోబర్‌లో కజాన్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చల్లో ఈ యాత్ర పునఃప్రారంభానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకాన్ని బలపరిచే గొప్ప అవకాశంగా మారుతోంది. ఐదేళ్ల తర్వాత భక్తులకు మళ్లీ ఈ యాత్రలో పాల్గొనడానికి అవకాశం లభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: వేసవిలో సోంపు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు

( kailash-gahlot | Kailash Manas sarovor yatra | kailash-vijay-vargeeya | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు