Telangana: కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ బాధ్యతలు ఎప్పుడంటే..

ఈ నెల 13న ఉదయం 11 గంటలకు ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస వర్మ గురు లేదా శుక్రవారం కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారు.

New Update
Telangana: కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ బాధ్యతలు ఎప్పుడంటే..

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రుల బాధ్యతలు చేపట్టేందుకు ముహుర్తాలు ఖరారయ్యాయి. ఈ నెల 13న గురువారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కూడా నార్త్‌ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరిస్తారు.

Also Read: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు!

ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ గురువారం లేదా శుక్రవారం కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. రామ్మోహన్‌ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా, పెమ్మసాని, శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రులుగా అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రామోజీరావు కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ పరామర్శ

Advertisment
తాజా కథనాలు