/rtv/media/media_files/2025/01/22/fFudwVwTuK7mXJNSBWu1.jpg)
Telangana Group1 recruitments issue High Court key orders
TG Group1: తెలంగాణ గ్రూప్1 వివాదం కొనసాగుతూనే ఉంది. తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కవ మార్కులు రావడంపై వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయించారో స్పష్టత కావాలని సూచించింది. దీంతో మరోసారి గ్రూప్1 రద్దుపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
వారికి తెలుగులో ప్రావీణ్యముందా?
ఈ మేరకు గ్రూప్-1 మూల్యంకనంలో తెలుగు అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ దాఖలైన పిటీషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. పరీక్ష రాసిన తక్కువ మార్కులు రావడానికి ప్రధాన కారణమేమిటో స్పష్టత ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు టీజీపీఎస్సీని ఆదేశించారు. అలాగే మెయిన్స్ మూల్యాంకనంలో అనుసరించే ప్రాతిపదిక, మార్కుల కేటాయింపు విధానంపై వివరణ కోరారు. ‘పరీక్ష పేపర్లు మూల్యాంకనం చేసినవారిలో ఎంతమందికి తెలుగులో ప్రావీణ్యముందని ప్రశ్నించారు. జవాబు పత్రాల ఆధారంగా మార్కులు కేటాయించారా? మార్కులు కేటాయింపుకోసం ఏదైనా ‘కీ’ ఉందా అని అడిగారు. ఒకే ప్రశ్నకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో రాసిన వారికి ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయించారో వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీని ఆదేశించారు.
పేర్లు బయటికి వెల్లడించలేము..
అయితే న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన టీజీపీఎస్సీ న్యాయవాది రాజశేఖర్.. ‘అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలుంటాయి. కాబట్టి కీ ఉండదు. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులనే మూల్యాంకనం కోసం నియమించాం. దీనిపై పిటిషనర్లు స్పష్టత ఇవ్వాలి. విద్యాశాఖ కమిషనర్కు, టీజీపీఎస్సీకి మధ్య మాత్రమే జరిగిన సమాచారం పిటిషనర్లకు ఎలా తెలిసింది? దీనిపై విచారణ జరిపించండి. మూల్యాంకనం చేసినవారి పేర్లు బయటికి వెల్లడించలేము. ఎందుకంటే వారిని కోర్టులకు ఈడుస్తారు. దీంతో భవిష్యత్తులో మరోసారి పేపర్ మూల్యంకనం అంటూ ఆసక్తిచూపించకపోవచ్చు అని తన వాదనలు వినిపించారు.
Also Read: Pakistan: ఐఎస్ఐ ఛీఫ్ కు కీలక బాధ్యతలు..పాకిస్తాన్ మరో ఎత్తుగడ
ఇక 2023లో హైకోర్టు గ్రూప్-1 రద్దు చేసింది. 2022 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఖాళీలు 503 ఉండగా అదనంగా 60 ఖాళీల భర్తీకి ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. దీంతో టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్ను రద్దు చేసి 563 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే నోటిఫికేషన్ను రద్దు చేసే అధికారం టీజీపీఎస్సీకి లేదు. పైగా ప్రిలిమ్స్కు, మెయిన్స్కు హాల్టికెట్ల నంబర్లను వేర్వేరుగా కేటాయించారని అభ్యర్థుల తరఫుణ వాదనలు వినిపించాయి. 16, 17, 18, 19 సెంటర్లలో పరీక్షలు రాసిన162 మందే (74 శాతం) ఉద్యోగాలకు అర్హత సాధించారు. మిగిలిన అన్ని సెంటర్లలో కేవలం 5% ఉత్తీర్ణతపై అనుమానాలున్నాయి. ఎంపిక చేసుకున్న కొందరి కోసమే కేంద్రాలను కేటాయించారు. అంతేకాదు రక్షణ కోసం పోలీసులకు 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పి.. ఆ తర్వాత 46 సెంటర్లలో ఎగ్జామ్స్ నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారి సంఖ్య ఒకసారి 21,093, మరోసారి 20,161, ఇంకోసారి 21,085 రకరకాలుగా చూపించడంలోనే అవకతవకలు జరిగాయని స్పష్టంగా తెలుస్తోందని వాదిస్తున్నారు. అభ్యంతరాలు వ్యక్తంచేసిన వారిపైనా క్రిమినల్ కేసులు పెడుతామని బెదిరిస్తున్నట్లు వాపోయారు.
Also Read: ఆ వ్యాధులు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తాగొద్దు.. షాకింగ్ విషయాలు!
అయితే ఈ అంశాలన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. గ్రూప్-1 నియామకాలపై తుది నిర్ణయం తీసుకోరాదని తెలిపింది. అలాగే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. మొత్తం నియామకాలను పక్కన పెట్టిన నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులపై వేసవి సెలవులు పూర్తయ్యేలోపు నిర్ణయించాలని సింగిల్ జడ్జికి సూచించింది. మరోవైపు నియామకాలు ఆగిపోయాయని, తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. దీంతో సింగిల్ జడ్జి వద్ద విచారణ ఉండగా తాము జోక్యం చేసుకోలేమని, అప్పీలుపై విచారణ క్లోజ్ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.
tgpsc | highcourt | group-1 | telugu-news | today telugu news