/rtv/media/media_files/2025/04/28/fwjbM15Ii8YjcZfaQs2n.jpg)
Chat GPT
NCERT : స్కూల్ సిలబస్లో NCERT భారీ మార్పులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 7వ తరగతి సోషల్ స్టడీస్ నుంచి మొఘల్, ఢిల్లీ సుల్తానుల చరిత్రను తొలగించింది. వాటికి బదులు మగధ, మౌర్యులు, తవాహనులు, శుంగలు వంటి ప్రాచీన చరిత్ర చాప్టర్లను చేర్చింది. మహా కుంభ్, భౌగోళిక శాస్త్రం, మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో, బేటీ పఢావో వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి సారించే కొత్త అధ్యాయాలను సైతం ప్రవేశపెట్టింది.
12 తీర్థయాత్రల చరిత్ర..
ఈ మేరకు 2023 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా 'స్టడీ ఆఫ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్' అనే సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. NCF -2023(నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్)లో భాగంగా కొత్త పుస్తకాలను రూపొందించినట్లు ప్రకటించారు. ‘భూమి పవిత్రంగా ఎలా మారుతుంది’ అనే పాఠ్యాంశంతోపాటు అన్ని మతాలు పవిత్రంగా భావించే ప్రదేశాలు, 12 తీర్థయాత్రలపై కూడా ప్రత్యక దృష్టిసారించారు. ఇందులో శక్తిపీఠాలతో కూడిన పవిత్ర భౌగోళిక ప్రాంతాలు, జ్యోతిర్లింగాలు, చార్దామ్ యాత్రకు సంబంధించిన అంశాలను జోడించారు. గ్రీకుల చరిత్రతోపాటు జానపద, సమ్రాజ్, అధిరాజా, రాజాధిరాజా అనే సంస్కృతం పదాలను కూడా చేర్చనున్నట్లు తెలిపారు. ఇక కొత్త పాఠ్యాంశాలను చేర్చిన 7వ తరగతి సాంఘిక శాస్త్రం పార్ట్-2 పుస్తకాన్ని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు NCRT ప్రకటించింది. అలాగే గతేడాది 3, 6లో కొత్త పాఠ్యాంశాలు చేర్చగా ఇప్పుడు 4, 7వ తరగతుల సిలబస్ అప్ డేట్ చేసినట్లు పేర్కొంది.
Also Read: Hyderabad Metro:తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్అండ్టీ
'మొఘలులకు సంబంధించిన పాఠాలు కుదించబడ్డాయని అని NCERT డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లాని స్పష్టం చేశారు. 'NCERT గతంలో మొఘలులు, ఢిల్లీ సుల్తానులకు సంబంధించిన పాఠాలను కుదించింది. ఇందులో తుగ్లక్లు, ఖిల్జీలు, మామ్లుక్, లోడీలు వంటి రాజవంశాల వివరాలు, మొఘల్ చక్రవర్తుల విజయాలపై రెండు పేజీలుండేవి. COVID-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2022, -23లో సిలబస్ను మరింత మెరుగుపరిచేందుకు ఈ కసరత్తు జరిగింది. ఈ పుస్తకంలోని కొత్త పాఠ్యాంశాలు విద్యార్థులు మరింత మెరుగుపడేలా విలువలను పెంపొందిస్తాయి. భారత సంస్కృతిని మరింత లోతుగా అధ్యయనం చేసుందుకు ఉపయోగపడతాయి. వయసుకు తగ్గట్లు ప్రపంచ దృక్పథాలను పరిచయం చేస్తాయి' అని ఆయన చెప్పారు.
Also Read: Pak-India: పాక్కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!
syllabus | school | telugu-news | today telugu news