GAZA: గాజాలో మిన్నంటుతున్న ఆకలి కేకలు..77 ట్రక్కులపై వేలాది మంది దాడి

గాజాలో ఆకలి కేకలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరైన ఆహారం దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. దీంతో అక్కడ ఫుడ్ ఉన్న ఫుడ్ గోదాములపై దాడులు చేస్తున్నారు. తాజాగా ఆహార పదార్థాలతో వెళుతున్న 77 ట్రక్కులపై వేలాది మంది దాడి చేశారు. 

New Update
gaza

Hungry In Gaza

హమాస్ లొంగడం లేదు. ఇజ్రాయెల్ తగ్గడం లేదు. ఇద్దరి మధ్యా యుద్ధం జరుగుతూనే ఉంది. ఐడీఎఫ్ గాజాపై బాంబులతో దాడులు చేస్తోంది. దీంతో అక్కడ లక్షలాది మంది బతుకులు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. మరెంతో మంది చనిపోయారు. ఇప్పుడు ఎన్నో వేలమంది ఆకలితో చావడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధ పరిస్థితులు కారణంగా గాజాలో కరువు తాండవిస్తోంది. అక్కడి ప్రజలకు సరైన మాట అటుంచి కనీసం నాలుగు మెతుకులు కూడా దొరకడం లేదు. దీంతో పాలస్తీనియన్లు దాడులకు పాల్పడుతున్నారు. 

ఆహారం కోసం విలవిల..

ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో పాలస్తీనియన్లు ఆహార గోడౌన్ల మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడ తిండి దొరికితే అక్కడకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఉదయం గాజాకు డబ్ల్యూఎఫ్పీ 77 ట్రక్కులతో ఆహారాన్ని పంపించింది. కానీ దానిపై వేలది మంది గాజా ప్రజలు దాడి చేశారు. ఆ ట్రక్కులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మొత్తం వాటిల్లో ఉన్న ఆహారాన్ని తీసుకెళ్ళిపోయారు. దాదాపు 80 రోజుల పాటు సాయం నిలిచిపోవడంతో వేలాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో ఆ వాహనాలను ముందుకు వెళ్లనిచ్చేందుకు వాళ్లు సిద్ధంగా లేరు అని డబ్ల్యూఎఫ్పీ చెబుతోంది.  ఆహారాన్ని పంపడానికి ఇజ్రాయెల్ అనుమతించింది కానీ అక్కడి ప్రజలకు మాత్రం అది అందడం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ఆకలి చనిపోతామేనని పాలస్తీనియన్లు భయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మరింత ఫుడ్ ను వారికి అందించాల్సి ఉందని అభిప్రాయపడింది. అయితే ఈ ప్రక్రియ సజావుగా సాగాలంటే వేగంగా అనుమతులు ఇవ్వడంతోపాటు వీటిని తరలించే కాన్వాయ్‌ కూడా సురక్షితంగా వెళ్లే పరిస్థితులు ఉండాలని తెలిపింది. కానీ దీనికి ఇజ్రాయెల్ పరిమితంగానే అనుమతులు ఇస్తోంది. చాలా తక్కువ మొత్తంలో ఫుడ్ ను పంపించేందుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటోంది. అవి గాజా ప్రజల ఆకలిని తీర్చడం లేదని డబ్ల్యూఎఫ్పీ చెబుతోంది. 

 

Also Read: Miss World 2025: మిస్‌ వరల్డ్‌ 2025 విజేతగా థాయ్‌లాండ్‌ సుందరీ.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే

Advertisment
Advertisment
తాజా కథనాలు