ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. సోషల్ మీడియా పని చేయలేదు. భారతదేశం కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.0 తరువాత నుంచి రెండు గంటల పాటూ సోషల్ మీడియా అయిన వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ ఆగిపోయాయి. తమ మెసెజ్లు వెళ్లడం లేదని, లాగిన్ చేయలేకపోతున్నామని..పోస్టులు పెట్టలేకపోతున్నామనివేల మంది యూజర్లు పేర్కొన్నట్లు డౌన్డిటెక్టర్ వెబ్సైట్ తెలిపింది. సుమారు 50వేల మందికి పైగా ఫేస్బుక్ యూజర్లు, 23వేల మందికి పైగా ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆవెబ్సైట్ తెలిపింది. సేవల్లో ఇబ్బందులు ఎదురుకావడంతో "ఎక్స్" వేదికగా పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు సేవలు నిలిచిపోవడంతో పలువురు ఎక్స్ వేదికగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. Also Read: GOOGLE: ఈ ఏడాది కూడా సౌత్ సినిమాలదే హవా.. Also Read: 400 బిలియన్ డాలర్ల క్లబ్ లో మస్క్..! Also Read: ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్