కేరళ కోజికోడ్ తీరంలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సింగపూర్కు చెందిన కంటైనర్ షిప్లో భారీ పేలుడు సంభవించింది. కేరళ తీరం నుంచి 130 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జూన్ 7న కంటైనర్ షిప్ కొలంబో నుంచి బయలుదేరింది. ఈ నెల 10న ముంబైకి చేరుకోవాల్సి ఉంది. కానీ ఈ క్రమంలోనే షిప్లో భారీ పేలుడు సంభవించింది.
Also Read: అశ్లీల చిత్రాల్లో నటించాలని ఒత్తిడి.. 6 నెలలు చిత్రహింసలకు గురైన యువతి
Also Read : BSNL కస్టమర్లకు అలర్ట్.. ఈ మెసేజ్ వస్తే ?
దీంతో ఇండియన్ కోస్ట్గార్డ్ పెట్రోలింగ్ నౌకలు రంగంలోకి దిగాయి. మంగళూరు నుంచి ICGS రాజ్దూత్, కొచ్చి నుంచి ICGS అర్ణ్వేష్, అగట్టి నుంచి ICGS సాచెట్ బయలుదేరాయి. మొత్తం 3 గస్తీ నౌకలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
Also Read: భగ్గుమంటున్న లాస్ ఏంజిల్స్.. కాలిబూడిదవుతున్న వందల కార్లు
Also Read : రిలేషన్ షిప్ వద్దన్నందుకు OYO రూమ్లో పొడిచి చంపేశాడు..
telugu-news | kerala | rtv-news