బంగ్లాదేశ్‌లో విధ్వంసం.. దీనికి కారణం షేక్ హసీనా ప్రసంగమేనా?

షేక్ హసీనా ప్రసంగం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. భారత్‌లో ఉంటున్న ఆమె సోషల్ మీడియా ద్వారా.. మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని అవామీ లీగ్ నేతలకు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారు.

New Update
Sheik Hasina:షేక్‌ హసీనాపై 53కు చేరిన కేసులు..

sheikh hasina

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ నేతల ఇళ్లు, ఆస్తులపై ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. కొందరు నేతల ఇంటికి నిరసనకారులు నిప్పు అంటించారు. షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక నివాసంపై కూడా ఎందరో దాడి చేశారు. అయితే మళ్లీ ఈ హింసాత్మక ఘటనలకు ముఖ్య కారణం షేక్ హసీనా ప్రసంగాలు అని తెలుస్తోంది. భారత్‌లో తలదాచుకుంటున్నా షేక్ హసీనా బుధవారం నాడు సోషల్ మీడియా ద్వారా పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ఆమె అవామీ లీగ్ నేతలకు పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో అవామీ లీగ్ నేతలపై నిరసనలు చేశారు. 

ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడి వివాహం!

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!

షేక్ హసీనా వ్యాఖ్యలు..

బంగ్లాదేశ్‌లో తనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం నిజానికి తనను హత్య చేయడానికే అని షేక్ హసీనా ఆరోపించారు.  మహ్మద్ యూనుస్ ప్రభుత్వం తనను, తన సోదరిని చంపాలని ప్లాన్ చేసిందంటూ కామెంట్స్ చేశారు. తన ప్రసంగంలో హసీనా తన నివాసంపై జరిగిన దాడి గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు. తన ఇంటికి ఎందుకు నిప్పంటించారని అడిగారు. తాను బంగ్లాదేశ్ ప్రజల నుండి న్యాయం కోరుతున్నానని.. తాను నా దేశానికి ఏమీ చేయలేదా? మరి ఇంత అవమానం ఎందుకు? అని ఆమె సోషల్ మీడియా ద్వారా నిలదీశారు. ఈ క్రమంలోనే మళ్లీ హింస చేలరేగినట్లు తెలుస్తోంది.   

Advertisment
Advertisment
తాజా కథనాలు