/rtv/media/media_files/2025/06/22/atom-bomb-2025-06-22-19-54-26.jpg)
Atom Bomb
ఇరాన్లోని అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటి పేర్లు మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడాన్ని రష్యా వ్యతిరేకించింది. అయితే ట్రంప్ తీరుపై కూడా దిమిత్రి మెద్వదేవ్ తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: ఇరాన్పై దాడులు.. అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ సంచలన ప్రకటన
మిడిల్ఈస్ట్లో ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారని అన్నారు. శాంతి దూతంగా చెప్పుకొని అధ్యక్షుడిగా ఎన్నికై.. ఇప్పుడు యుద్ధానికి కారణమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటికే ఇరాన్లోని సామాన్య ప్రజలు భయాందోళనతో జీవనం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంపై అమెరికా దాడులు చేసి మరో కొత్త వివదానికి దారి తీసిందంటూ విమర్శలు చేశారు.
Also Read: ఇరాన్పై అమెరికా దాడులు.. అత్యంత సురక్షిత బంకర్లోకి ఖమేనీ
అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో అణుస్థావరాలపై దాడులు చేసిన ప్రత్యర్థులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమెరికా చాలా పెద్ద నేరం చేసిందని మండిపడ్డారు. గగనతల ఆంక్షలను పట్టించుకోకుండా దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు. ఇక్కడున్న యూఎస్ స్థావరాలపై తాము దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
The United States, a permanent member of the United Nations Security Council, has committed a grave violation of the UN Charter, international law and the NPT by attacking Iran's peaceful nuclear installations.
— Seyed Abbas Araghchi (@araghchi) June 22, 2025
The events this morning are outrageous and will have everlasting…