పాక్‌లో వింత ఘటన.. ఆ దేశ ఆర్మీ జవాన్లకు, పోలీసులకు మధ్య గొడవ.. VIDEO

భారత్, పాకస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ సైనిక సిబ్బంది, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Police Taunts Pak Army Officers In Viral Face-Off Video

Police Taunts Pak Army Officers In Viral Face-Off Video

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణం ఏం జరుగుతందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా పాకిస్థాన్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ సైనిక సిబ్బంది, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్‌లో పాక్ ఆర్మీ కాన్వాయ్ వచ్చింది. అయితే కాన్వాయ్‌ను పోలీస్‌ స్టేషన్‌లోకి రాకుండా అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. 

Also Read: దొంగ కాదు గజదొంగ.. కళ్లలో కారం కొట్టి డబ్బులతో పరార్ - వీడియో చూశారా?

ఈ సమయంలో ఆర్మీ సిబ్బంది, పోలీసులు మధ్య ఘర్షణ చెలరేగింది. కొందరు పోలీసులు ఆర్మీ సిబ్బందిపై తుపాకి గురి పెట్టడం కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. ''మీ బుద్ధి పనిచేయడం లేదా. వాళ్లని కశ్మీర్‌కు పంపించింది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మీ జనరల్ వచ్చినా ఏమీ చేయలేడు అంటూ'' ఓ పోలీస్ అధికారి హిందీలో తిట్టిన మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇదిలాఉండగా ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పతనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ అంతర్గత సంక్షోభం నెలకొన్న వేళ.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ తన కుటుంబంతో దేశం విడిచి పారిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

Also Read: మోదీ కుల గణన నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

పహల్గాం దాడి అనంతరం భారత్‌.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ పౌరులను దేశ నుంచి వెళ్లిపోవాలని కోరడం, సరిహద్దులను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాక్ ప్రజలే సైనిక వ్యవస్థపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని పలువురు భద్రతా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. దీంతో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఈ అంశంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు.  

Also Read: కర్రెగుట్టను స్వాధీనం చేసుకున్న బలగాలు.. జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు.. 

 telugu-news | rtv-news | international | pakistan-army

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు