Pakisthan: పాకిస్తాన్ ను తిరస్కరిస్తే రక్తం ప్రవహిస్తుంది.. ప్రధాని మోదీపై బిలావల్ భుట్టో ప్రేలాపన

యుద్ధమంటూ జరిగితే ప్రవహించేది రక్తమే అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో మరో సారి అన్నారు. సింధు జలాలను ఆపేస్తే నదిలో రక్తం పారుతుందనే తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. దాంతో పాటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. 

author-image
By Manogna alamuru
New Update
pakistan

Bilawal Bhutto

Pakisthan: సింధు జలాల(Indus River) విషయంలో భారత ప్రధాని మోదీ(PM Modi) తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పని పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో(PPP Chairman Bilawal Bhutto) మరోసారి వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. సింధు నది సింధ్ ప్రావిన్స్ గుండా ప్రవహిస్తుందని..సింధు లోయ నాగరికతలో భాగమైన పురాతన నగరం మొహెంజో-దారో దాని ఒడ్డున వృద్ధి చెందిందని బిలావల్ భుట్టో అన్నారు. కానీ ఆ నాగరికత లర్కానాలోని మొహెంజో-దారోలో ఉంది. మేము దాని నిజమైన సంరక్షకులం. మేము దానిని రక్షించుకుంటాము అని ఆయన అన్నారు.

Also Read: పహల్గామ్ దాడి తరువాత భారత్ పై 10 లక్షల సైబర్ దాడులు

యుద్ధం తప్పదు...రక్తమే ప్రవహిస్తుంది..

తాను భారత్, పాకిస్తాన్ భార్డర్ లో తుపాకీతో నిలబడలేదని...ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా తనకు ఆ పదవి లేదు. కానీ యుద్ధమంటూ వస్తే ఊరుకోమని భుట్టో అన్నారు. సింధునది మీద తాను వ్యక్తపరిచిన బావాలు మామూలుగా వచ్చింది కాదు...అది పాకిస్తాన్ ప్రజల భావాలను వ్యక్తపరచడం అని చెప్పుకొచ్చారు. భారత ప్రధాని చేసిన అతి పెద్ద తప్పు సింధు జలాల విషయంలో తీసుకున్న నిర్ణయం. అది యుద్ధానికే దారి తీస్తుందని బిలావల్ భుట్టో అన్నారు. రక్తం ప్రవహించడం తప్పనిసరి అన్నారు. పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకంగా భారతదేశం నీటిని ఆయుధంగా మార్చాలనుకుంటే అది యుద్ధ చర్య అవుతుంది.

Also Read: రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. GO 111 ఉల్లంఘనపై హైకోర్టు నోటీసులు!

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

today-latest-news-in-telugu | pakistan | pm modi | sindhu-river

Also Read: NIA: పహల్గాం దాడి ఉగ్రవాదులు భారత్ లోనే ఉన్నారు...ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు