Moscow: పాకిస్తాన్ తో రష్యా డీల్స్.. భారత్ తో సంబంధాలు చెడగొట్టేందుకేనా?

పాకిస్తాన్ కు రష్యా ఆయుధాలను సప్లై చేస్తోంది ..దీని కోసం బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది...ఈ వార్తలకు చెక్ పెట్టింది మాస్కో. పాక్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని...భారత్ తో తమ సంబంధాలు చెడగొట్టేందుకు ఈ ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
russia

Putin, Shehabaz Sharif

పాకిస్తాన్‌తో మాస్కో బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసిందనే వార్తలను రష్యా తోసిపుచ్చింది. ఇవన్నీ ఒట్టి పుకార్లేనని స్పష్టం చేసింది. భారతదేశంతో తమకున్న సంబంధాలను దెబ్బతీసేందుకే ఈ ప్రయత్నాలని చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ కలిసినట్టుగా సరిక్యులేట్ అవుతున్న ఫోటో కూడా ఇప్పటిది కాదని...2024లో ఇద్దరూ కలిసినప్పటిదని చెప్పింది. 

ఆ వార్తలన్నీ అబద్ధాలే..

 రష్యా, పాకిస్తాన్ $2.6 బిలియన్ల ఒప్పందంపై సంతకం చేశాయి. కరాచీలో సోవియట్ కాలం నాటి ఉక్కు కర్మాగారాన్ని పునరుద్ధరించడానికి రష్యా ఒప్పుకుందని కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి. అయితే దీనిపై చర్చలు జరిగినప్పటికీ సంతకం చేసినట్లు ఎటువంటి రుజువు లేదని మాస్కో తేల్చింది. ఇది మొదట నిక్కీ ఆసియా అనే పత్రక నివేదించింది. కానీ రష్యా 2022 నుంచి ఈ పత్రికకు నివేదికలు ఇవ్వడం మానేసిందని తెలిపింది. పహల్గాం దాడి తర్వాత భారత్ కు చాలా దేశాలు మద్దుతు తెలిపాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ తో చేస్తున్నపోరాటినిక అండగా నిలబడ్డాయి. ఆపరేషన్ సింధూర్ ను ప్రోత్సహించాయి. ఈ దేశాల్లో రష్యా కూడా ఉంది. భారత్, రష్యాల మధ్య దౌత్యసంబంధాలు చాలా రోజుల నుంచి చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మాస్కో అంటోంది. 

 

Also Read: DOGE: ఎలాన్ మస్క్ తర్వాత డోజ్ పరిస్థితి ఏంటి? మూతబడుతుందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు