/rtv/media/media_files/2025/03/23/Cg9XpljoX2nx3KwUuruk.jpg)
Choksi
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు ,వజ్రాల వ్యాపారి మోహుల్ ఛోక్సీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.అంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్న ఛోక్సీ ఇటీవల వేరే దేశం వెళ్లాడని తెలిసింది. ప్రస్తుతం బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని , తన సతీమణి ప్రీతితో కలిసి ఆ దేశంలో నివసిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఆయన్ని స్వదేశానికి రప్పించే విషయమై బెల్జియం అధికారులను భారత్ సంప్రదించినట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను దాదాపురూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018 లో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం ఛోక్సీ,నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయాడు.ఛోక్సీ అంటిగ్వా-బార్బుడాకు పారిపోగా...నీరవ్ బ్రిటన్ జైలులో ఉన్నాడు.
Also Read: America: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
వీరిని భారత్ కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన అంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛేత్ గ్రీన్ మాట్లాడుతూ..ఛోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని,వైద్యం కోసం విదేశాలకు వెళ్లారని తెలిసిందన్నారు. ఛోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ..ఆయన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసిపని చేస్తున్నాయని చెప్పారు.
బెల్జియం జాతీయురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబర్ లో మోహుల్ ఛోక్సీ ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ పొందినట్లు సమాచారం. ఈ కార్డు ద్వారా కొన్ని షరతులకింత జీవిత భాగస్వామితో కలిసి బెల్జియం చట్టబద్ధంగా ఉండొచ్చు.దీనికోసం ఆయన తప్పుడు పత్రాలను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయని ఓ వార్తాకథనం పేర్కొంది. ఛోక్సీ ఇప్పటి వరకు భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు.
Also Read: Father murdered son: భార్య మీద అనుమానంతో 3ఏళ్ల కొడుకు గొంతు కోసిన టెక్నిషియన్
Also Read: Samsung Tv Offers: హాట్ హాట్ శాంసంగ్ సేల్.. టీవీలపై భారీ డిస్కౌంట్- సగం ధరకే సౌండ్ బార్!
mohul choksi | belzium | punjab-national-bank | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates