Iran Israel Conflict: కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు..టెహ్రాన్‌పై బాంబుల వర్షం

ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌ వాటిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని 250 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ సైన్యం దాడులకు దిగింది.

New Update
Iran Israel Conflict

Iran Israel Conflict

Iran Israel Conflict : ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌ వాటిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని 250 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ సైన్యం దాడులకు దిగింది.  ఇరాన్‌ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులకు దిగుతోంది. చమురు, సహజవాయు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌లోని రెండు చమురు డిపోలు బాంబుదాడుల్లో చిక్కుకున్నాయి.  ప్రపంచంలోనే అతి పెద్ద చమురు క్షేత్రంగా పిలవబడే సౌత్‌ పార్స్ పై కూడా దాడి జరిగింది. దీంతో ఇక్కడ పనులను తాత్కాళికంగా నిలిపివేశారు. అయితే ఇజ్రాయెల్‌ దాడులు ఆపితే తాము ఆపుతామంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్‌ ఏ మాత్రం స్పందించలేదు.


 
ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్

కాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోందని రష్యా ఆరోపించింది. ఖమేనీని లేపేయబోతున్నారని అమెరికా అధికారులు  ప్రకటించినట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి -- వీలైనంత త్వరగా దేశం వదిలి పారిపోవాలని సలహా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.  -- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో 224 మంది మృతి చెందగా, 1277 మందికి గాయాలయ్యాయి. మరోవైపు -- కారు బాంబుల్లో 14 మంది అణుశాస్త్రవేత్తల్ని ఇజ్రాయెల్‌ లేపేసింది. ఇరాన్ దాడుల్లో 14 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

 వెనక్కి తగ్గిన ఇరాన్‌

ఇరాన్, ఇజ్రాయెల్‌ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.-- ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్‌ వెనక్కి తగ్గింది. ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తామూ ఆపేస్తామని ప్రకటించింది. ఆత్మరక్షణ కోసమే 'టెల్ అవీవ్‌'పై దాడి చేశామని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. అమెరికా అండ చూసుకుని ఇజ్రాయెల్ రెచ్చిపోతోందని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్‌ దాడిలో దాదాపు 200 మంది మృతి చెందారని పేర్కొంది.-- కీలక అణుశాస్త్రవేత్తలు, ఆర్మీ అధికారుల్ని  ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది.

ఇరాన్‌కు మద్ధతు ప్రకటించిన పాక్‌

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ---ఇరాన్‌కి మద్దతు ప్రకటించింది. ముస్లిం దేశాలు ఏకం కావాలని పాక్ మంత్రి ఖవాజా పిలుపునిచ్చారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ---ఇప్పటికే ఇరాన్‌కి మద్దతుగా యెమెన్ మిలటరీ యుద్ధంలోకి దిగింది. ---ఇజ్రాయెల్‌పై రెండు హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించింది. గాజాపై దాడులు చేస్తూ ఇజ్రాయెల్ అన్యాయం చేస్తోందని యెమెన్‌ ఆరోపించింది.

ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ మధ్య  భీకర కాల్పుల నేపథ్యంలో  ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చింది.-- ఇజ్రాయెల్, ఇరాన్‌ దాడులపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.-- దాడులతో సంబంధం లేదంటూనే ఇరాన్‌కు ట్రంప్  హెచ్చరిక జారీ చేశారు.-- అమెరికాపై దాడికి ప్రయత్నిస్తే ఇరాన్‌ను భస్మం చేస్తామని ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు.-- యూఎస్‌ బలగాలు ఇరాన్‌ను ఖతం చేస్తాయని ట్రంప్‌ హెచ్చరించారు.అమెరికా రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుందన్నారు.-- అమెరికాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.
 
భారత్‌, పాక్‌ యుద్ధం ఆపింది నేనే...మరోసారి ట్రంప్‌ అదే మాట

ఇరాన్‌ ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు తానే ప్రకటించుకున్నాడు.  ఈ మేరకు తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో పోస్ట్‌ చేశాడు. భారత్‌, పాక్‌ తాను చెప్పిన మాట విని కాల్పుల విరమణ చేసుకున్నాయని ఇజ్రాయెల్‌, ఇరాన్‌ అదే బాటలో నడవాలని సూచించాడు. గతంలోనూ అనేక యుద్ధాలను ఆపానని చెప్పుకున్న ట్రంప్‌ సెర్బియా, కొసావో- ఈజిప్టు, ఇథియోపియోల మధ్య శాంతిని నెలకొల్పానని చెప్పుకొచ్చాడు. తాజాగా భారత్‌, పాక్‌ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానని కవరింగ్‌ ఇచ్చుకున్నాడు.  ఇన్ని చేసినా నాకు ఘనత దక్కడం లేదన్న ట్రంప్‌ అయినా ప్రజలు అర్ధం చేసుకుంటారని పేర్కొన్నాడు.
   

Advertisment
Advertisment
తాజా కథనాలు