Iran: ఇప్పటికి సేఫ్.. దాడుల వల్ల లీక్ లు జరగలేదు..ఇరాన్

ఇరాన్ లోని మూడు అణు స్థావరాలను ధ్వంసం చేసింది అమెరికా. ఈ దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఎటువంటి కాలుష్య సంకేతాలు లేవని ఇరాన్ జాతీయ అణు భద్రతా వ్యవస్థ స్పష్టం చేసింది.

New Update
Nuclear site

Iran says No Signs Of Contamination

ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసంచేసేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు కంకణం కట్టుకుని కూర్చొన్నాయి. అందుకు తగ్గట్టుగానే రెండు దేశాలూ వాటిపై దాడులు చేశాయి. గత తొమ్మిది రోజులుగా ఇజ్రాయెల్ ఒక్కో అణు కేంద్రంపై దాడి చేసుకుంటూ వస్తే..అమెరికా మాత్రం రాత్రికి రాత్రే మూడు అణు కేంద్రాలను లేపేసింది. ఇరాన్ లో అత్యంత కీలకమైన భూగర్భ అణు కేంద్రం ఫార్డోను కూడా నాశనం చేసింది. అయితే అణు కేంద్రాల మీద దాడులు చేయడం అంత మంచిది కాదని నిన్న ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. వాటి నుంచి రేడియో ధార్మికత విడుదల అయితే ఇరాన్ తో పాటూ పక్కనున్న దేశాలు కూడా కరిగిపోతాయని చెప్పింది. అదే రోజు రాత్రి అమెరికా అణు స్థావరాలపై అటాక్ చేసింది. దీంతో అందరకీ భయం పట్టుకుంది. అణు కేంద్రాల నుంచి లీక్ లు ఏమైనా జరిగాయా అని అనుమానాలు తలెత్తాయి. 

Also Read :  ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి స్వదేశానికి మరో 310 మంది

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

కాలుష్య సంకేతాలు లేవు..

ఇస్ఫహాన్, ఫోర్డో, నటాంజ్‌ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ స్పందించింది అణు కేంద్రాల నుంచి ఎటువంటి లీక్ లు జరగలేదని తేల్చి చెప్పింది. ఎటువంటి కాలుష్య సంకేతాలు లేవని ఇరాన్ జాతీయ అణు భద్రతా వ్యవస్థ స్పష్టం చేసింది. దాడుల తర్వాత దాని రేడియేషన్ డిటెక్టర్లు ఎటువంటి రేడియోధార్మిక విడుదలను నమోదు చేయలేదని అంది. అలాగే దాని చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు కూడా ఎటువంటి ప్రమాదం లేదని తెలిపింది. 

Also Read :  'కుబేరా' సక్సెస్ సెలెబ్రేషన్స్.. శేఖర్ కమ్ముల, నాగార్జున ఫొటోలు వైరల్

అమెరికా అణు స్థావరాలపై దాడి చేయడానికి ఆరు రకాల మందుగుండు సామగ్రిని ఉపయోగించారు. ఆరు B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు, వర్జీనియా/LA-క్లాస్ N-సబ్‌మెరైన్‌లు, పన్నెండు GBU-57 బంకర్ బస్టర్లు, ముప్ఫై టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు, వాయు ఆధిపత్యం కోసం F-22 రాప్టర్లలతో పాటూ F-35 లైట్నింగ్ IIలను కూడా అమెరికా ఉపయోగించింది. అయితే ఇన్ని దాడులు జరుగుతున్నా..అన్ని దేశాలూ వద్దని చెబుతున్నా కూడా ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. తమ అణు శక్తిని అభివృద్ధి చేయడం ఆపమని అంటోంది. పైగా అణు కేంద్రాలపై దాడులతో ఇజ్రాయెల్, అమెరికా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. కానీ దాడుల వల్ల ఎంత నష్టం జరిగిందో మాత్రం చెప్పడం లేదు. 

Also Read: Satellite Footage: ఫార్డో అణు కేంద్రంపై పెద్ద ఫ్లాష్..ఉపగ్రహ వీడియో

 

usa-attack | today-latest-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు