/rtv/media/media_files/2025/06/21/another-flight-from-iran-brings-310-indians-home-from-iran-2025-06-21-20-24-23.jpg)
Another Flight From Iran Brings 310 Indians Home, Total Evacuated Now 827
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో 310 మంది భారతీయులు ఇరాన్ నుంచి భారత్కు వచ్చారు. మొత్తం ఇప్పటిదాకా 827 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశంగా శాఖ తెలిపింది. అవసరాన్ని బట్టి ఈ ఆపరేషన్ కొనసాగుతుందని.. ఇరాన్లో ఉన్న ప్రతి పౌరుడికి సాయం అందిస్తామని స్పష్టం చేసింది.
Also Read: హోటల్లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ సింధు మిషన్ చేపట్టినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. వాస్తవానికి ఇరాన్ నుంచి పౌరులను తరలించడం సవాలుతో కూడుకున్న వ్యవహారమని.. అయినప్పటికీ భారత ప్రభుత్వం దీన్ని సమర్థవంతంగా నిర్వహించిందని స్పష్టం చేసింది.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
ఇదిలాఉండగా శనివారం ఇరాన్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇజ్రాయెల్తో ఉద్రిక్త పరిస్థితుల వేళ.. ఇరాన్ సీక్రెట్గా అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. దీనివల్లే ఇది భూకంపానికి కారణం అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
Also Read: బుఫెహర్ రియాక్టర్ ను పేల్చొద్దు.. ఐక్యరాజ్య సమితి నిఘా సంస్థ హెచ్చరిక