Iran vs Israel : ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం....అమెరికాలో హై అలెర్ట్‌...

ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా ఆదివారం ప్రత్యక్ష దాడులు చేసింది. ఈ క్రమంలో ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగే ఛాన్స్‌ ఉందనే అనుమానంతో అమెరికా  హైఅలర్ట్‌ ప్రకటించింది.

New Update
Iran vs Israel

Iran vs Israel

Iran vs Israel : పశ్చిమాసియాలో ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.కాగా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా ఆదివారం ప్రత్యక్ష దాడులు చేసింది. ఈ క్రమంలో ఇరాన్‌ ప్రతీకార చర్యలకు దిగే ఛాన్స్‌ ఉందనే అనుమానం ఉన్న పలు ప్రాంతాల్లో అమెరికా  హైఅలర్ట్‌ ప్రకటించింది. అమెరికా దాడులకు ప్రతిగా టెహ్రాన్‌ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతోంది.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

ఇరాన్‌ ప్రతీకార చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా సిద్దమైంది. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. వాషింగ్టన్‌ సహా పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇరాన్‌లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

అమెరికా మొదలు పెట్టింది.. ఇక మేం ముగింపు ఇస్తాం...ఇరాన్‌ హెచ్చరిక 

 ఇరాన్‌ లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్  ప్రకటించారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నది. ఈ విషయాన్ని ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్‌ పై దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను మీడియా ఛానెల్స్‌కు విడుదల చేసింది.

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

ఇరాన్‌ -ఇజ్రాయెల్‌ యుద్ధంలో సహకారంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన రెండు రోజుల్లోనే ట్రంప్‌ ఇరాన్‌పై దాడులు చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఫోర్డోపై  అమెరికా భారీ బాంబులు వేసిందని, ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామని బాంబు దాడుల అనంతరం ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇజ్రాయెల్‌, అమెరికా చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన పరిణామమని తెలిపారు. తమ దాడులతో ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.మరోవైపు ఇరాన్‌పై దాడులకు ప్రతిగా తాము ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ట్రంప్‌ను హెచ్చరించారు. దాంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం  కనిసిస్తోంది.
 

Also Read :  బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..

 

Advertisment
Advertisment
తాజా కథనాలు