IND-PAK WAR: పాక్ తో భారత్ దౌత్య యుద్ధం.. విదేశాలకు పంపించనున్న ఎంపీలు వీళ్లే!

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్‌ సిద్ధమైంది. దీనికోసం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీల ఎంపీలతో ఏర్పాటైన ఈ కమిటీ పాక్‌ ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందుంచనుంది. ఈక్రమంలో విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపనుంది.

New Update
India's diplomatic war with Pakistan.

India's diplomatic war with Pakistan.

IND-PAK WAR: పహల్గాం లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతికారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. దీంతో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకరిపై ఒకరు బాంబు దాడులకు దిగాయి. అయితే ఆ తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి. అయితే పాక్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్‌ సిద్ధమైంది. దీనికోసం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసింది.అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ పాక్‌ ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందు ఉంచనుంది.

Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?

ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్‌ చేస్తున్న కృషిని అంతర్జాతీయ సమాజానికి తెలియజేయనుంది. ఈక్రమంలో విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపనుంది. ఇందుకోసం వివిధ రాజకీయ పార్టీల ఎంపీలతో  కూడిన ఏడుగురు ఎంపీలతో  కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో శశి థరూర్‌( కాంగ్రెస్‌), రవిశంకర్‌ ప్రసాద్‌(భాజపా), సంజయ్‌ కుమార్‌ ఝా(జేడీయూ), బైజయంత్‌ పాండా(భాజపా), కనిమొళి కరుణానిధి(డీఎంకే), సుప్రియా సూలే(ఎన్సీపీ), శ్రీకాంత్‌ ఏక్‌నాథ్‌ శిందే (శివసేన) ఉన్నారు. 

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?

Advertisment
Advertisment
తాజా కథనాలు