30వేల కోట్లతో భారత్ మిస్సైల్ సిస్టం.. | Big Shock To Pakistan | India Pak War | PM Modi | RTV
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమైంది. దీనికోసం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీల ఎంపీలతో ఏర్పాటైన ఈ కమిటీ పాక్ ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందుంచనుంది. ఈక్రమంలో విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపనుంది.
యుద్ధానికి మేం వెనకాడబోమని పాకిస్తాన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం భారత సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. పాకిస్తాన్ సాయుధ దళాలు రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, చైనీస్ హోవిట్జర్లలను సరిహద్దు వెంట కవాతు చేసి మోహరించాయి.
ఇండియా నుంచి పాకిస్తాన్కు పోస్టల్, పార్శిల్ సర్వీసులు నిలిపివేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అలాగే పాకిస్తాన్ షిప్పులు మన ఓడరేవుల్లో ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్తో 1971 యుద్ధం సమయంలో అప్పటి PM ఇందిరా గాంధీ అదే నిర్ణయం తీసుకున్నారు.
ఎమర్జెన్సీ విధించే దిశగా పాకిస్తాన్ పాలన నడుస్తోంది. భారత్ ఎప్పుడు సర్జికల్ స్ట్రైయిక్స్ చేస్తోందో అన్న భయంతో పాకిస్తాన్ ఎయిర్ పోర్టులు మూసేశారు. నెల రోజులపాటు పాకిస్తాన్లోని కరాచీ, లాహోర్ సిటీల్లో విమానాలు ఎగరడాన్ని నిషేధించారు.
పహల్గామ్ టెర్రర్ అటాక్పై విచారణ జరిపాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం కొట్టేసింది. పిటిషన్ వేసేటప్పుడు కొంచెం బాధ్యతగా ఉండాలని న్యాయస్తానం సీరియస్ అయ్యింది. సైన్యాన్ని నిరుత్సాహ పరిచేందుకే ఇలాంటివి చేస్తున్నారా అని కోర్టు ప్రశ్నించింది.