Ind-pak: దాయాది పాకిస్తాన్ఖపై భారత్ బలమైన దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ భారత్పైకి ఉసిగొల్పుతున్నారనే కోపంతో రగిలిపోతున్న ఇండియా.. ప్రపంచ దేశాలు విస్తుపోయేలా శత్రుదేశాన్ని దెబ్బకొట్టాలని చూస్తోంది. పాక్ కోలుకోకుండా చేసేందుకు త్రివిధ దళాలు బ్లూప్రింట్ రెడీ చేశాయి.
పాక్ తీరానికి 85 మైళ్ల దూరంలో..
ఈ మేరకు LOC దగ్గర పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగా దీటుగా బదులిచ్చిన భారత్.. సరిహద్దుల్లో మిలటరీ బలగాలతోపాటు ‘ఎయిర్ డిఫెన్స్’ను మోహరించింది. అరేబియా సముద్రంలోనూ యుద్ధ విమాన వాహక నౌకను సిద్ధం చేసింది. స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. పాక్ తీరానికి 85 మైళ్ల దూరంలో నౌకాదళ విన్యాసాలను నిర్వహించింది. లద్ధాఖ్, జమ్మూకశ్మీర్ బేస్లలో వాయుసేన సిద్ధంగా ఉంది. రక్షణ వ్యవస్థలైన ఇగ్లా–ఎస్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి సరిహద్దులకు తరలించింది.
Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!
త్రివిధ దళాధిపతులతో భేటీ..
మరోవైపు ప్రధాని మోదీ వరుసగా త్రివిధ దళాధిపతులతో భేటీ అవుతున్నారు. ఈ వారంలోనే మే9లోపు యుద్ధ కార్యాచరణ పూర్తి చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భారత త్రివిధ దళాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అంతేకాదు శత్రుదేశపై త్రిముఖ దాడి చేసేందుకు త్రివిధ దళాధిపతులు ముగ్గురు సర్వం సన్నద్ధంగా ఉన్నట్లు మోదీకి చెప్పినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎదురుదాడి చేసినా తిప్పికొట్టే వ్యూహల గురించి ప్రధానికి వివరిచింనట్లు తెలుస్తోంది. త్రివిధ దళాలూ పాకిస్థాన్ను చుట్టుముట్టి, కోలుకోలేని దెబ్బకొట్టేలా ప్రణాళికలు రచించినట్లు సమాచారం.
Also Read: కీలక అప్డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు
బ్లూప్రింట్ సిద్ధం..
ఇదిలా ఉంటే.. ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేసేందుకు వైమానిక దళం క్షిపణులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అరేబియా సముద్రంలో యుద్ద నౌకలు రెడీగా ఉన్నాయి. మొత్తంగా బ్లూప్రింట్ సిద్ధంగా ఉండగా మోదీ గ్రీన్ సిగ్నల్ కోసమే ఎదురుచూస్తున్నామని రక్షణ శాఖ అధికారులు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. మే 9న ‘రష్యా విక్టరీ డే’కు భారత్ తరఫున ఒకరు వెళ్లాల్సివుంది కానీ యుద్ధం మొదలైతే ప్రధానితోపాటు రక్షణ మంత్రి తప్పనిసరి ఉండాలి కాబట్టి రష్యా టూర్ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇక యుద్ధం నేపథ్యంలో భారత రాయబారులు ఇప్పటికే అన్ని మిత్రపక్ష దేశాలతో చర్చలు జరిపారు. అన్ని దేశాల మద్దతు ప్రకటించాయని విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ తెలిపారు.
ind-vs-pak | attack in Pahalgam | army | ias-terrorist | telugu-news | today telugu news