/rtv/media/media_files/2025/08/31/sco-summit-modi-with-jinping-2025-08-31-12-21-01.jpg)
SCO summit modi with jinping
SCO Summit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాల నేపథ్యంలో, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ కలిసి సమావేశమవడం అంతర్జాతీయంగా ఆసక్తి రేపింది. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనాలోని టియాన్ జిన్లో వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీ, కేవలం సరిహద్దు సమస్యల పరిష్కారానికే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై పెరుగుతున్న అమెరికా ఒత్తిడికి వ్యతిరేకంగా భారత్, చైనాలు ఒకే వేదికపైకి వచ్చాయని నిరూపించింది. ఈ సమావేశం అమెరికా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న అమెరికాకు ఓ పరోక్ష సందేశాన్ని పంపిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరు దేశాలు తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాయని, అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగిపోవని ఈ భేటీ స్పష్టం చేసింది.
Ahead of the Shanghai Cooperation Organization (SCO) summit in China, Indian Prime Minister Narendra Modi held a bilateral meeting with Chinese President Xi Jinping.
— Bharat Spectrum (@BharatSpectrum) August 31, 2025
This meeting between the two leaders is considered extremely important. They engaged in detailed discussions on… pic.twitter.com/ODfno1gGuX
SCO Summit 2025 | दोस्ती की नई उड़ान...महामुलाकात! | PM Modi - Xi Jinping Meeting | China pic.twitter.com/euXu9bsg7N
— News18Himachal (@News18Himachal) August 31, 2025
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో జిన్పింగ్, 'డ్రాగన్' (చైనా), 'ఏనుగు' (భారత్) కలిసి వచ్చి స్నేహితులుగా ఉండటం ప్రపంచానికి చాలా ముఖ్యమైన అంశమని వ్యాఖ్యానించారు. జిన్పింగ్ మాట్లాడుతూ, మోడీని మళ్లీ కలవడం సంతోషంగా ఉందని, ప్రపంచ వేదికపై భారత్, చైనా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. చైనాతో భారత్ సంబంధాలు మెరుగుపర్చుకోవాలనే తమ ఆకాంక్షను ఆయన తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, పరస్పర ప్రయోజనాలను గౌరవించుకోవాలని సూచించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ, గత ఏడాది కజాన్లో జరిగిన సమావేశం తర్వాత ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం మెరుగుపడిందని తెలిపారు. అలాగే, ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయిలో విమాన సర్వీసులను పునరుద్ధరించడానికి అంగీకరించినట్లు కూడా చెప్పారు. భారత్-చైనా సత్సంబంధాలు 2.8 బిలియన్ల ప్రజలకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని ఆయన పేర్కొన్నారు.
UPSC-Oriented SWOT Analysis: Modi-Xi Bilateral Meeting at SCO Summit 2025 – Geopolitical Reset Amid US Tariff Onslaught, BRICS Fortification, and India's Multipolar Pivot
— Raj Malhotra (@Rajmalhotrachd) August 31, 2025
Prelims GS Paper 1: Current Affairs, International Relations, Economic Geography, and Modern History Focus… pic.twitter.com/jagY9S0Nyy
సరిహద్దు వివాదాల తర్వాత తొలి భేటీ
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల అనంతరం భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటినుండి ఇరు దేశాల నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. ఈ నేపథ్యంలో, జిన్పింగ్తో మోడీ భేటీ అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఈ భేటీలో సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను నెలకొల్పడం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు.
ఈ భేటీ తర్వాత, ఇరు దేశాలు వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సమావేశం, భారత్-చైనా సంబంధాలలో ఒక కొత్త శకానికి నాంది పలికిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో, భారత్, చైనా సంబంధాలను మెరుగుపరుచుకోవడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.