Asaduddin -owaisi: భారత్, పాక్ యుద్ధమేగాలు కమ్ముకుంటున్న వేళ MIM నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని కోరారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి చొరబడి, అక్కడే మకాం వేసేందుకు ఇదే సరైన సమయమని, ఈ అవకాశం వదులుకోవద్దని అన్నాడు.
ఈ మేరకు పహల్గాం ఘటనపై మీడియాతో మరోసారి మాట్లాడిన అసదుద్దీన్.. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక సైనిక, వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని సూచించారు. 'భారత సైన్యం దాడులకు భయపడి పాక్ సైనికాధికారులు విదేశాలకు పారిపోతున్నారు. ఇది గొప్ప పరిణామం. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి దాడులు చేస్తామని ప్రధాని మోదీ గతంలో చెప్పారు. ఇప్పుడు ఆ పని చేసి చూపించాలి. పీఓకేను స్వాధీనం చేసుకోవాలి. పీఓకే భారత్కే చెందుతుంది. ఇప్పటికే పార్లమెంట్లో తీర్మానం ఆమోదించాం. ఇక వెనకడుకు వేయాల్సిన అవసరం లేదు' అంటూ పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే హైదరాబాద్ ఘటనలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దిల్ సుఖ్ నగర్, లుంబినీ పార్కు, గోకుల్ చాట్ ఉగ్రదాడిని గుర్తు చేశారు. 2019లో పుల్వామా, ముంబై వీటీ స్టేషన్లో తెలుగు పండితుడు, ఓ నవ వధువు ఘోరాలను ప్రస్తావించారు. వైష్ణోదేవి ఆలయం వద్ద జరిగిన ఉగ్రదాడిని తలచుకుంటూ టెర్రరిస్టులనే పూర్తిగా ఏరివేయాలన్నాడు. మోదీ అధికారంలో మీ చేతుల్లోనే ఉంది. ఉగ్రదాడులకు చరమగీతం పాడండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Asaduddin owaisi: భారత్, పాక్ యుద్ధం.. మోదీపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్!
భారత్, పాక్ యుద్ధంపై MIM నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. టెర్రరిస్టులకు చరమగీతంపాడి, పీవోకేను స్వాధీనం చేసుకోవాలని కోరారు.
India-Pakistan war MP Asaduddin Owaisi sensational comments
Asaduddin -owaisi: భారత్, పాక్ యుద్ధమేగాలు కమ్ముకుంటున్న వేళ MIM నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్కు గట్టి బుద్ధి చెప్పాలన్నారు. పీవోకేను స్వాధీనం చేసుకోవాలని కోరారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి చొరబడి, అక్కడే మకాం వేసేందుకు ఇదే సరైన సమయమని, ఈ అవకాశం వదులుకోవద్దని అన్నాడు.
వెనకడుకు వేయొద్దు..
ఈ మేరకు పహల్గాం ఘటనపై మీడియాతో మరోసారి మాట్లాడిన అసదుద్దీన్.. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక సైనిక, వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని సూచించారు. 'భారత సైన్యం దాడులకు భయపడి పాక్ సైనికాధికారులు విదేశాలకు పారిపోతున్నారు. ఇది గొప్ప పరిణామం. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి దాడులు చేస్తామని ప్రధాని మోదీ గతంలో చెప్పారు. ఇప్పుడు ఆ పని చేసి చూపించాలి. పీఓకేను స్వాధీనం చేసుకోవాలి. పీఓకే భారత్కే చెందుతుంది. ఇప్పటికే పార్లమెంట్లో తీర్మానం ఆమోదించాం. ఇక వెనకడుకు వేయాల్సిన అవసరం లేదు' అంటూ పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
అలాగే హైదరాబాద్ ఘటనలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దిల్ సుఖ్ నగర్, లుంబినీ పార్కు, గోకుల్ చాట్ ఉగ్రదాడిని గుర్తు చేశారు. 2019లో పుల్వామా, ముంబై వీటీ స్టేషన్లో తెలుగు పండితుడు, ఓ నవ వధువు ఘోరాలను ప్రస్తావించారు. వైష్ణోదేవి ఆలయం వద్ద జరిగిన ఉగ్రదాడిని తలచుకుంటూ టెర్రరిస్టులనే పూర్తిగా ఏరివేయాలన్నాడు. మోదీ అధికారంలో మీ చేతుల్లోనే ఉంది. ఉగ్రదాడులకు చరమగీతం పాడండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
asaduddin-owisi | telugu-news | today telugu news