America: ట్రంప్‌ ఎఫెక్ట్‌ ...నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!

అమెరికాలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.అక్రమ వలసదారులను ట్రంప్‌ పంపించేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఓ బాలికను తన తోటి విద్యార్థులు ట్రంప్ మిమ్మల్ని కూడా పంపేస్తారని వేధించడంతో భయపడి ఆత్మహత్య చేసుకుంది.

New Update
Donald Trump

Donald Trump

అమెరికాలో రెండోసారి ట్రంప్‌ అధ్యక్షబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి పై ఉక్కుపాదం మోపారు. అగ్రరాజ్యాధినేతలు అక్రమవలసదారులను బంధించి సంకెళ్లు వేసి మరి విమానాల్లో సొంత దేశాలకు తరలిస్తున్నారు.ఈ క్రమంలోనే అమెరికాలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది.పాఠశాలలోని ఇతర విద్యార్థులు తన బిడ్డను వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి ఆరోపించింది.

Also Read: Satwik Sairaj: కొడుకుకి ధ్యాన్‌చంద్‌ ఖేల్ రత్న పురస్కారం..కానీ ఇంతలోనే తండ్రి..!

తమ  కుటుంబం అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నదని, త్వరలో తమని  గొలుసులతో బంధించి దేశం నుండి బహిష్కరిస్తామని చెప్పి వారు నా కూతురిని అవమానించినట్లు బాలిక తల్లి చెప్పుకొచ్చింది. వివరాల ప్రకారం..టెక్సాస్ నివాసి అయిన జోస్లిన్ రోజో కరాన్జా ఫిబ్రవరి 8న ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి 'మీ తల్లిదండ్రులను బంధించి పంపివేస్తారు.మీరు ఇక్కడే ఒంటరిగా మిగిలిపోతారు;' అని ఎంతసేపు తోటి విద్యార్థులు వేధించడం వల్లే తన బిడ్డ భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది.

Also Read: Zelensky VS Musk: పిల్లలు చచ్చిపోతుంటే..మీకు ఫొటో షూట్ లా!

"నా కూతురు అంత ఒత్తిడికి గురైందని అనుకోలేదని జోసెలిన్ తల్లి మార్బెల్లా కరాన్జా అన్నారు. ఆమె తన స్కూల్లో వేధింపులకు గురవుతున్నట్లు నాకు ఎప్పుడూ తెలియదు.11 ఏళ్ల బాలిక ఆత్మహత్య తర్వాత, సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ గురించి అనేక విమర్శలు వినపడుతున్నాయి. ఈ విద్యార్థి ఆత్మహత్యకు ట్రంప్‌ విధానాలే కారణమని ప్రజలు భావిస్తున్నారు.

నిజానికి, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఆయన ఒకదాని తర్వాత ఒకటిగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు, అవి మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. దేశ వలస చట్టాన్ని కఠినతరం చేయడం అటువంటి నిర్ణయం. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులను నిరంతరం బహిష్కరిస్తోంది. అనేక దేశాల పౌరులను గొలుసులతో వారి దేశాలకు తిరిగి పంపించారు, దీని కారణంగా ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

భారతదేశంలో కూడా చాలా గందరగోళం నెలకొంది

అమెరికా సరిహద్దు పోలీసులు అక్రమ భారతీయ వలసదారులను తిరిగి పంపించడానికి విమానంలో ఎక్కించుకుంటున్నప్పుడు..ఒక వీడియో విడుదలైంది. దీనిలో భారతీయులందరి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు ఉన్నాయి. అమెరికా ఈ అమానవీయ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేయాలని ప్రతిపక్షాలు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ట్రంప్ ప్రభుత్వ ఈ వైఖరిని అనేక ఇతర దేశాలు కూడా తీవ్రంగా విమర్శించాయి.

Also Read: Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

Also Read: FBI: ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా ట్రంప్ విధేయుడు..ఇంతకీ ఈ భారతీయుడు ఎవరో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు