విషాద విహారయాత్ర.. నీట మునిగి 8 మంది మృతి

రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్‌ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే.

New Update
eight men drown in Rajasthan's Banas river

eight men drown in Rajasthan's Banas river

రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్‌ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే.. బక్రీదు తర్వాత మంగళవారం జైపూర్‌ ఘాట్‌గేట్‌, హసన్‌పుర ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు టోంక్‌ జిల్లా బనాస్ నది వద్దకు పిక్‌నిక్‌కు వచ్చారు. 

Also Read: తొక్కిసలాట ఘటన.. గవర్నర్‌, -సీఎం మధ్య వివాదం

అయితే వీళ్లలో ముగ్గురు నది ఒడ్డున  వంటలు చేస్తుండగా ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఈ క్రమంలోనే నీటిలో దిగిన పలువురు మునిగిపోతూ కేకలు వేశారు. ఒడ్డున ఉన్నవారు స్థానికులకు ఈ సమాచారం అందించారు. మునిగిపోయేవారిని కాపాడేందుకు స్థానికులు యత్నించారు. కానీ అప్పటికే 8 మంది నీటిలో ఊపిరాడక మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

Also Read: గ్రెటా థన్‌బర్గ్‌కు షాక్.. వెనక్కి పంపిన ఇజ్రాయెల్‌

మృతదేహాలను వెలికితీసి అక్కడి నుంచి తరలించారు. మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వాళ్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అయితే అందరూ ఒకేసారి ఎలా మునిగిపోయారనేదానిపై క్లారిటీ లేదన్నారు. వాళ్లందరూ నీటి లోతు అంచనా వేయకుండా దిగి ఉంటారని అన్నారు. నీటిలో మునిగిపోతుండగా ఒకరినొకరు కాపాడుకనే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఈ విషాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా నీటిలో మునిగి చనిపోయిన సంఘటనలు చాలానే జరుగుతున్నాయి.  

Also Read: ట్రంప్ తప్పు చేశాడా.. అధికారాన్ని దుర్వినియోగం చేశాడా.. అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయి?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు