China Renames Arunachal Pradesh: మరోసారి చైనా కుట్ర.. అరుణాచల్ ప్రదేశ్ పేరు మార్చి.....

భారత్‌ పాకిస్థాన్‌ల మధ్యఉద్రిక్తతలు ముగిశాయో లేదో ఆ దేశానికి వంతపాడుతూ వస్తున్నచైనా మరో కుట్రకు తెరలేపింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు పేర్లు మారుస్తూ ఓ జాబితాను విడుదల చేసింది. అయితే చైనా వైఖరిని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది

New Update
CHINA AND INDIA

CHINA AND INDIA

China Renames Arunachal Pradesh: భారత్‌ పై ఉగ్రదాడులను(Terrorist Attacks on India) ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌తో(Pakistan) ఉద్రిక్తతలు ముగిశాయో లేదో ఆ దేశానికి వంతపాడుతూ వస్తు్న్న చైనా మరో కుట్రకు తెరలేపింది.  రెండుదేశాలకు సమీపంలో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ర్టంలోని పలు ప్రాంతాలకు పేర్లు మారుస్తూ ఓ జాబితాను విడుదల చేసింది. అయితే చైనా వైఖరిని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది.  చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యనించింది. ఇది వృథా అని, ఇలాంటి అహంకారపూరిత చర్యల్ని సహించేది లేదని స్పష్టం చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని పేర్కొంది. అయితే చైనా గతంలోనూ ఇలాంటి పనే చేసింది. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను తరచూ మారుస్తూ వస్తోంది.

Also Read: 'ఈట్.. స్లీప్.. సలార్'.. బొమ్మ వచ్చి 500 రోజులు దాటినా ఊపు తగ్గలేదుగా!

 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

అరుణాచల్ ప్రదేశ్‌ను జాంగాంగ్‌గా

కాగా, అరుణాచల్ ప్రదేశ్‌ను జాంగాంగ్‌గా చైనా పిలుస్తుంది. దాన్ని టిబెట్‌ దక్షిణ భాగంగా పేర్కొంటుంది. గతంలోనూ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాల పేర్లను మార్చి లిస్ట్ రిలీజ్ చేసింది. అంతేకాదు అరుణాచల్‌ను తమ దేశ మ్యాప్‌లో జోడించి కొత్త మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. అయితే వీటన్నంటిని భారత్‌ వ్యతిరేకిస్తూ వస్తున్నది. చైనా చాలకాలంగా అరుణాచల్‌ ప్రదేశ్‌పై ఆదిపత్యం చేలాయించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య తరుచూ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.  అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఉన్న ప్రదేశాలకు పేర్లు మార్చడం, తన చైన్యాన్ని మొహరించడం, చైనా ఆర్మీ స్ధావరాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ భారత్‌ ను రెచ్చగొడుతోంది. గతంలోనూ ఇరుదేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Also Read: 11 మంది పాక్ సైనికులు హతం.. 78 మందికి గాయాలు!

పాకిస్థాన్‌తో యుద్ధం చేసి కాల్పుల విరమణ పాటిస్తున్న ప్రస్తుత తరుణంలో చైనా కావాలనే భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణ ఉంది. ఈ ఉద్రిక్తతలను ఆసరగా తీసుకుని భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతుందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు