Brs Silver Jubilee : అమెరికాలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవాలు....చీఫ్‌ గెస్ట్‌ ఎవరంటే?

బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ వేడుకలను అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించనున్నారు. జూన్ 1న డల్లాస్‌లోని డీఆర్ పెప్పర్ అరేనాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు.

New Update
BRS Silver Jubilee

BRS Silver Jubilee

Brs Silver Jubilee : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్కంగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఇటీవల తన 25వ వార్షికోత్సవాన్ని వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తి వేదికగా జరుపుకుంది. 14 సంవత్సరాలు తెలంగాణ సాధన ఉద్యమం, 10 సంవత్సరాలు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో అపజయాన్ని మూటకట్టుకుంది. అయితే గడచిన 16 నెలలుగా స్తబ్దుగా ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులకు మొన్నటి సభ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ ఊహించినదానికంటే ఎక్కువగా విజయవంతమైందన్న భావనలో ఉన్న బీఆర్‌ఎస్‌ తిరిగి తన సత్తాను చాటుకోవాలనుకుంటోంది. అందులో భాగంగా తెలంగాణతో పాటు ఆయా దేశాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు.

Also read : ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?

బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ వేడుకలను అమెరికాలోని డల్లాస్ నగరంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 1న డల్లాస్‌లోని డీఆర్ పెప్పర్ అరేనాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. ఈ మేరకు.. ఎన్నారై బీఆర్ఎస్ నాయకుడు మహేష్ బిగాల ప్రకటన విడుదల చేశారు.

Also read : TGSRTC : బస్సు భవన్‌‌ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..

BRS Silver Jubilee Celebrations in America

ఇదిలా ఉండగా చాలాకాలంగా ప్రచారం సాగుతున్నట్టే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు కుటుంబ సభ్యులు అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. కేటీఆర్ కుమారుడు, కుమార్తె అమెరికాలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని చూసేందుకు కేసీఆర్ దంపతులు మే 22 తర్వాత అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. ఆయన పదిరోజులపాటు అక్కడే ఉంటారని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ కవిత కూడా ఈనెల 16 నుంచి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా పర్యటన నేపథ్యంలో కవితకు సీబీఐ కోర్టు అనుమతి కూడా మంజూరు చేసింది.  

Also read :  India vs Pakistan : భారత్‌ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్‌ మరోసారి క్షిపణి ప్రయోగం?

అయితే పార్టీ అగ్ర నాయకత్వమంతా అమెరికా పర్యటనలో ఉండనుండటంతో పార్టీ అభిమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ వేడుకలను అమెరికాలోని డల్లాస్ నగరంలో ఘనంగా నిర్వహించేందుకు గులాబీ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ మేరకు జూన్ ఒకటో తేదీన డల్లాస్‌లోని DR పెప్పర్ అరేనాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఎన్నారై బీఆర్ఎస్ నాయకుడు మహేష్ బిగాల  స్పష్టం చేశారు.డల్లాస్ నగరంలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మహేష్ బిగాల తెలిపారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరవుతారని ఆయన వెల్లడించారు.  

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

brs mlc kavitha | kcr | ktr | brs-senior-leaders | brs silver jubilee celebrations

Advertisment
Advertisment
తాజా కథనాలు