Pakistan: మరోసారి రెచ్చిపోయిన బలూచ్‌ లిబరేషన్ ఆర్మీ.. పాక్‌ సైనికులపై బాంబు దాడి

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరోసారి రెచ్చిపోయింది. పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని మంగళవారం ఐఈడీ అమర్చి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పాక్ సైనికులు మృతి చెందారు.

New Update
balochistan Liberation Army

balochistan Liberation Army

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరోసారి రెచ్చిపోయింది. పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని మంగళవారం వరుసగా దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పాక్ సైనికులు మృతి చెందారు. కలాట్ టౌన్‌లోని హర్బొయి ప్రాంతంలో బీఎల్‌ఏ ఐఈడీ అమర్చింది. దీంతో ఘటనలో పలువురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పాయారు. మరోవైపు ఖుజ్దార్‌ ప్రాంతంలో ఉన్న ఓ పోలిస్ స్టేషన్‌పై కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడింది. 

Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!

ఇదిలాఉండగా ఇటీవల బీఎల్ఏ ట్రైన్‌ హైజాక్‌ చేసి ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వేర్పాటు వాదులు దాదాపు 500 మందితో ప్రయాణిస్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. రైలు మార్గంలో 17 సొరంగాలు ఉండగా.. 8వ సొరంగం వద్ద రైల్వే ట్రాక్‌ను పేల్చి తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు పాక్ సైన్యం కొంతమందని రక్షించగా.. మరికొందరు బీఎల్‌ఏ అదుపులోనే ఉన్నారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన కాల్పుల్లో 33 మందికి పైగా మిలిటెంట్లను పాక్ సైనికులు హతం చేసినట్లు అధికారులు చెప్పారు.  

Also Read: రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు బీజేపీ స్పెషల్ గిఫ్ట్

మరోవైపు ఇటీవలే పాక్ సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌ను టార్గెట్‌ చేసిన బీఎల్‌ఏ బాంబు దాడికి పాల్పడింది. 90 మంది సైనికులు మృతి చెందినట్లు పేర్కొంది. కానీ ఈ దుర్ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందారని ఆర్మీ అధికారులు తెలిపారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ మధ్య గత కొన్ని రోజులుగా దాడులు కొనసాగుతుండటంతో పాకిస్తాన్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి . 

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

Also Read: ఉద్యోగులకు IBM ఊహించని షాక్.. 9 వేల మంది ఔట్!

balochistan attack | pakistan-army | balochistan liberation army | telugu-news | rtv-news

Advertisment
Advertisment
తాజా కథనాలు