/rtv/media/media_files/2025/05/31/ScSJVPYpG87JW4uXSU5P.jpg)
Balochistan Attack On Pakistan Army
Balochistan Attack On Pakistan Army:
స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ పాకిస్థాన్కు బక్కలో బల్లెంలా తయారయింది. పాకిస్థాన్పై వరుస దాడులు చేస్తూ పాక్ సైనికులకు చుక్కలు చూపిస్తోంది. గడచిన రెండు నెలల కాలంలో వందలాది మంది పాక్ సైనికులు బలూచ్ ఆర్మీ చేతిలో హతమయ్యారు. సౌరభ్ సిటీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను బలూచ్ఆర్మీ సీజ్ చేసింది. సౌరభ్ సిటీని స్వాధీనం చేసుకున్న బలూచ్ సైన్యం అక్కడి పోలీస్ స్టేషన్ పై దాడి చేసింది. ఈ ఘటనలో ఒ సీనియర్ పోలీస్ అధికారి హతమయ్యారు. అనంతరం స్టేషన్ లోని ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే పలు కీలక హైవేలను బీఎల్ఏ ఆధీనంలోకి తీసుకుంది. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. కొన్ని వాహనాలను, ఆయుధాలను బలూచ్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?
కాగా ఇటీవలే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అనేక సంవత్సరాలుగా బలూచ్ ప్రజలు తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల కొరత, పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అణచివేతలపై ఆరోపణలు చేస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా ఉంది. ఇది పాకిస్తాన్ సైన్యం మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతోంది.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
ఈ క్రమంలోనే స్వతంత్ర దేశం గా అవతరించినట్లు స్వయంగా ప్రకటించుకుంది. అలాగే నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో కొత్త పార్లమెంట్ ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అలాగే భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశంలో రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరింది.
Also Read: USA: ట్రంప్ సాధించేశారు..సుంకాల విషయంలో అనుకూలంగా మరో కోర్టులో తీర్పు