Baba Vanga Prediction: మరికొన్ని గంటల్లో మెగా సునామీ.. బాబా వంగా జ్యోతిష్యం

మరికొన్ని గంటల్లో జపాన్‌లో సునామీ వస్తుందని, దేశం అంతం అవుతుందని బాబా వంగా తన పుస్తకంలో రాశారు. జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని కోట్లాది మంది ప్రజలు చనిపోతారని, ప్రపంచ పటంలో జపాన్ ఉండని పుస్తకంలో ఉంది. దీంతో జపాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

author-image
By Kusuma
New Update
Baba Vanga

Baba Vanga

ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందని ముందే కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. అయితే కరోనా వస్తుందని ముందుగానే గ్రహించి 20 ఏళ్ల కిందట తన పుస్తకంలో బాబా వంగా రాశారు. సరిగ్గా రాసినట్లు జరగడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా వంగా పేరు మారు మ్రోగుతుంది. జూలై 5న సునామీ రాబోతుందని, జపాన్ అంతం అవుతుందని బాబా వంగా ప్రిడిక్షన్ చెబుతోంది. ఇంతకీ బాబా వంగా తన ప్రిడిక్షన్‌లో సునామీ గురించి ఏం రాశారు? నిజంగానే సునామీ వస్తుందా? ఈ ప్రపంచం అంతం అవుతుందా? లేకపోతే కేవలం జపాన్ అంతం అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

ఇది కూడా చూడండి: Woman Kills Husband: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

ఇది కూడా చూడండి: China: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

జపాన్ అంతం తప్పదు..

జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని జపాన్‌కు చెందిన న్యూ బాబా వంగా తన ప్రిడిక్షన్‌లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని ఆ బుక్‌లో బాబా వంగా రాశారు. ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబా వంగా పుస్తకంలో రాసి ఉంది. ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టక్స్ కీని జపాన్ బాబా వంగా అని పిలుస్తారు. ఇతను 1999లో ది ఫ్యూచర్ ఐసా లో అనే పుస్తకం రాశారు. ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతుందని దివ్యదృష్టితో చూసి పుస్తకంలో లిఖించారు. అయితే మొదటిలో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు. కానీ కాలక్రమేణా ఆమె రాసినవి అన్ని జరగడంతో బాగా పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు జూలై 5వ తేదీన జపాన్‌లో సునామీ వస్తుందని రాసి ఉంది. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి. 

ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్

ఇప్పటి వరకు బాబా వంగా చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి. 1995లో కోబ్ భూకంపం, 2011 తోహోలో భూకంపం, 2020లో కరోనా వైరస్, ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణం కూడా బాబా వంగా తన పుస్తకంలో రాశారు. ఇవన్నీ నిజం కావడంతో ఇప్పుడు జపాన్ సునామీ కూడా వస్తుందని, ఇక అంతం అయిపోతుందని జపాన్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరి జపాన్ దేశం ప్రపంచ చిత్ర పటంలో ఉంటుందో లేదో తెలియాలంటే జూలై 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

ఇది కూడా చూడండి: Konda Murali: నాగార్జునపై అందుకే ఆ వ్యాఖ్యలు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు