Israel: హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు

తాజాగా ఇజ్రాయెల్‌ మళ్లీ హెజ్‌బొల్లాపై దాడులకు దిగింది. శుక్రవారం లెబనాన్‌లోని హెజ్‌బొల్లా భూగర్భ స్థావరాలపై బంకర్‌ బస్టర్‌ బాంబులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 11 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు.

New Update
1 killed and 11 wounded in intense Israeli strikes on south Lebanon

1 killed and 11 wounded in intense Israeli strikes on south Lebanon

ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన సంగతి తెలిసిందే. కానీ మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ మళ్లీ హెజ్‌బొల్లాపై దాడులకు దిగింది. శుక్రవారం లెబనాన్‌లోని హెజ్‌బొల్లా భూగర్భ స్థావరాలపై బంకర్‌ బస్టర్‌ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లాకు సంబంధించి కీలక ఆయుధ స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ బంకర్ బస్టర్‌ బాంబుల వల్ల పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నాయని లెబనాన్ వార్తా సంస్థ తెలిపింది.  

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 11 మంది పాలస్తీనియన్లు గాయపడ్డట్లు పేర్కొంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇదిలాఉండగా గతేడాదే నవంబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. హమాస్‌కు మద్దితిస్తూ హెజ్‌బొల్లా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ హెజ్‌బొల్లాపై దాడులకు దిగింది. ఆ సంస్థకు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 

Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు

మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య రెండోసారి కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా హమాస్‌ చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనీయన్లను విడుదల చేస్తోంది. ఇక గాజాపై కూడా ఇజ్రాయెల్ తమ దాడులు నిరంతరం కొనసాగిస్తూనే ఉంది. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు తమ వద్ద ఎలాంటి మార్గం లేదని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేశారు.  

Also Read: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖమేనీని హత్య చేయాలనుకున్నాం, కానీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు