Hyderabad:హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో దారుణం..ఇద్దరు బాలికలపై దాడి

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికల మీద రమణ అనే అబ్బాయి కత్తితో దాడి చేశాడు. ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తూ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భయంతో రమణ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
Hyderabad:హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో దారుణం..ఇద్దరు బాలికలపై దాడి

Ambarpet:హైదరాబాద్ అంబర్‌ పేట్‌లో ఊహించని సంఘటన జరిగింది. ఇద్దరు మైనర్ బాలికల మీద టీనేజర్ రమణ కత్తితో దాడి చేశాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఒక అమ్మాయిని రమణ కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి మీద కత్తితో దాడి చేశాడు. ఇంట్లో ట్యూషన్ చెబుతున్న అమ్మాయి మీద దాడి చేశాడు. అతనిని అడ్డుకోబోయిన మరో అమ్మాయి మీద కూడా అదే కత్తితో దాడి చేసి పారిపోయాడు. దీంతో రమణ ఇద్దరు బాలికలను కత్తితో కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో బాలికలిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. దాడిలో గాయపడిన అమ్మాయిలిద్దరూ బంధువులు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు బాలికలు విద్యానగర్‌ AMS హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

పుట్టినరోజు నాడే మృతి..

ఈరోజు చనిపోయిన రమణ పుట్టినరోజు. దీంతో ఒకరోజు ముందుగానే అతను ప్రేమించిన యువతి సమక్షంలో కేక్‌ కట్ చేయాలని ఆశపడ్డాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో నిన్న సాయంత్రం ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాడి తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

Also Read:నెలరోజుల్లోనే రన్ ముగిసిందా..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిందీ!

భయంతో ఆత్మహత్య
కత్తితో దాడి చేసిన తర్వాత రమణ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత భయంతో దగ్గరలోనే ఉన్న విద్యానగర్ ఎమ్ఎమ్టీఎస్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుర్రాడు చచ్చిపోయాడని చెబుతున్నారు. రాత్రి 12 గంటలకు రైలు కింద తలపెట్టి బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహం ఉంది.

Advertisment
తాజా కథనాలు