Special Trains: సంక్రాంతి (Sankranti) పండగ వచ్చేసింది. ఈ పండుగ కోసం సొంత ఊళ్లకు వెళ్లేవారు చాలా మంది 3 నెలల ముందు నుంచే రైళ్ల టికెట్లను బుక్ చేసుకుంటారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వెళ్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఏ ట్రైన్ చూసినా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. ప్రయాణికుల (Passengers) రద్దీని ద్రుష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్ల(Special trains)ను నడపనున్నట్లు ప్రకటించింది. ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఈ రైళ్లను వినియోగించుకోవాలని ప్రయాణికులకు రైల్వే అధికారులు సూచించారు.
పూర్తిగా చదవండి..Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్..సంక్రాంతి కానుకగా 32 స్పెషల్ ట్రైన్స్..ఏయే మార్గాల్లో అంటే?
సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు చేరుకోవాలనుకునేవారికోసం జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 స్పెషల్ ట్రైన్స్ ను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు పేర్కొంది.
Translate this News: