/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
Family Commits Suicide
హైదరాబాద్(hyderabad) లోని అంబర్పేట్లో తీవ్ర విషాదం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక భార్య, భర్త, పదేళ్ల కూతురు ఫ్యాన్కు ఉరేసుకొని మృతి(Family Commits Suicide) చెందడం కలకలం రేపింది. రెండ్రోజుల క్రితమే వీళ్ల సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కుటుంబం ఇంతకు ముందు రామ్నగర్లో ఉండేది. కొన్ని నెలల క్రితమే అంబర్పేట్కు వచ్చారు. ఇటీవల ఆ ఫ్యామిలీలో వాళ్ల పెద్ద కూతురు మరణించింది. అలాగే వాళ్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్చే చేసుకున్న దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మీలతో పాటు వాళ్ల కూతురు శ్రావ్యగా గుర్తించారు.
Also Read : ట్రైన్లో మ్యాగీ చేసిన మహిళపై రైల్వే చర్యలు.. అసలు రైళ్లలో ఏం చేయొచ్చు..? ఏం చేయొద్దు..? రూల్స్ ఇవే!
Also Read : 12 ఏళ్ల బాలికను రేప్ చేసిన భూతవైద్యుడు.. తల్లిదండ్రులు ఉండగానే - ఛీఛీ
Follow Us