Swechcha: తెలుగు యాంకర్ సూసైడ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్క(40) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో ఆమె దాదాపు 18ఏళ్ల పని చేసిన అనుభవం ఉంది.

New Update
anchor

ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్చ వోటార్కర్(40) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని ఆమె నివాసంలో  ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారు. పలు తెలుగు న్యూస్ ఛానళ్లలో ఆమె దాదాపు 18ఏళ్ల పని చేసిన అనుభవం ఉంది. స్వేచ్ఛ‌కు పెళ్లై ఓ పాప ఉంది. విడాకులు తీసుకొని మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :  పూరీ జగన్నాథ్ రథయాత్రలో 500 మంది భక్తులకు గాయాలు

Telugu News Anchor Swechcha Suicide

Also Read :  కోహ్లీ జెర్సీలో చితకబాదిన సూర్యవంశీ.. ఇంగ్లాండ్‌ చిత్తు చిత్తు

Also Read :  గుండెపోటుతో బిగ్ బాస్ ఫేమ్.. ప్రముఖ నటి మృతి

స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్‌లో నివసిస్తున్నారు. ఆమె తండ్రి శంకర్, ఉమ్మడి ఏపీలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలోనూ క్రియాశీలకంగా పనిచేశారు. 

ఐదేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వేచ్ఛ, తన కుమార్తె, ఓ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నారు. అయితే, ఆ అతనితో ఏర్పడిన వ్యక్తిగత విభేదాల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆమె మృతికి కచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు.

Also Read :  Constable Kanakam web Series: కానిస్టేబుల్ కనకంగా అదరగొట్టిన వర్ష బొల్లమ్మ.. !

 

anchor suicide | anchor swetha suicide | latest-telugu-news | telangana | telugu crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు