Telangana: న్యూడ్ వీడియోలతో వ్యాపారం.. లైవ్ వీడియోకి రూ.2 వేలు!

హైదరాబాద్‌లో భార్యాభర్తలు కలిసి న్యూడ్ వీడియోలతో వ్యాపారం చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఒక్కో లైవ్ లింక్‌కు రూ.2 వేలు, వీడియోకు రూ.500 వసూళ్లు చేస్తున్నారు.

New Update
Certificate forgery racket busted, six arrested in Saroornagar

Arrest

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు కలిసి న్యూడ్ వీడియోలతో వ్యాపారం చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బరితెగించి లైవ్‌లో భర్తతో శృంగారం చేస్తున్న వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తూ వ్యాపారం చేస్తున్నారు.  స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఒక్కో లైవ్ లింక్‌కు రూ.2 వేలు, వీడియోకు రూ.500 వసూళ్లు చేస్తున్నారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దంపతుల ఇంటిపై దాడులు చేసి వారిని ఐటీ యాక్ట్ కింద అరెస్టు చేశారు. వారి కెమెరా, మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్‌ మేనేజర్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

ఏనుగు దంతాలతో..

ఇదిలా ఉండగా.. బస్సులో అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా రెండు ఏనుగు దంతాలు బయటపడ్డాయి. వాటివిలువ సుమారు రూ. 3కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. కాగా నిందితులు శేషాచలం అడవుల నుంచి ఏనుగు దంతాలు తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయానికి యత్నించినట్లు తెలిసింది. పట్టుబడ్డ నిందితుడి పేరు మహర్షి అని తేలింది. 

ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్‌

కాగా పట్టుబడ్డ దంతాల విలువ రూ.3కోట్ల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.  రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితుడు ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్ (మహర్షి) ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

 ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు ఏనుగు దంతాల విలువ రూ. 3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.  కాగా నగరంలో ఏనుగు దంతాల బిజినెస్‌ నడుస్తుందన్న అటవిశాఖ అధికారుల ఫిర్యాదు మేరుకు రాచకొండ ఎస్ఓటి పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ తో ఈ ముఠాను పట్టుకున్నారు. ప్రసాద్ తిరుపతి జిల్లాలోని శేషాచలం ఫారెస్ట్ నుంచి ఏనుగు దంతాలు తీసుకువచ్చాడని తెలిపారు.

ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు