Crime News : పెళ్లి చేసుకోవాలన్నందుకు.. చంపి ఏడు ముక్కలు చేసి బావిలోకి

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో దారుణం జరిగింది. ఒక బావిలో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
water well

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ఝాన్సీ జిల్లా(Jhansi district) లో దారుణం జరిగింది. ఒక బావిలో ఒక మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కనిపించింది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామ మాజీ ప్రధాన్‌ సంజయ్‌ పటేల్‌తో వితంతు మహిళకు  వివాహేతర సంబంధం ఉంది.  అయితే  పదే పదే పెళ్లి చేసుకోవాలని ఆమె డిమాండ్ చేయడంతో విసుగు చెందిన మాజీ ప్రధాన్‌ సంజయ్‌ పటేల్‌..  ఆమెను చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. అతని మేనల్లుడు సందీప్ పటేల్‌తో కలిసి ఝాన్సీలోని కిషోర్‌పురా గ్రామంలో ఆ మహిళను హత్య చేసి మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికి, సంచుల్లో నింపి, బావిలో, వంతెన దగ్గర పడేశారు. 

Also Read :  రిమాండ్ లో ఉన్న మహిళా ఖైదీ అనుమానస్పద మృతి

బావి నుండి దుర్వాసన

అయితే 2025 ఆగస్టు 13న తన పొలాలను పరిశీలించిన రైతు బావి నుండి దుర్వాసన వస్తున్నట్లు గమనించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. నీటిలో తేలియాడుతున్న రెండు బస్తాలలో ఒక మహిళ శరీర భాగాలు కనిపించాయి. దీంతో పోలీసులు, స్థానికులు షాకయ్యారు. దీంతో ఆమె ఎవరో కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ సంఘటన జరిగిన తర్వాత సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ఝాన్సీ కేసును ఛేదించడానికి ఎనిమిది దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఆగస్టు 17న పోలీసులు బాధితురాలి చేతులను బావి నుండి స్వాధీనం చేసుకున్నారు. అయితే తల, కాళ్ళు కనిపించకపోవడంతో ఆమె ఎవరో కనిపెట్టడం మరింత కష్టంగా మారింది. పోస్ట్‌మార్టం నిర్వహించి ఆగస్టు 18న దహన సంస్కారాలు నిర్వహించారు.

పెళ్లి డిమాండ్ చేయడం వల్లే

బాధితురాలు మాజీ ప్రధాన్ పై నిరంతరం పెళ్లి డిమాండ్ చేయడం వల్లే ఈ హత్య జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి ప్రతిస్పందనగా, పటేల్ తన సహచరులతో కలిసి ఆమెను అంతమొందించడానికి కుట్ర పన్నాడు, ఫలితంగా ఆమె దారుణ హత్యకు గురైంది. తీవ్రమైన దర్యాప్తులో 100 మందికి పైగా గ్రామస్తులను ప్రశ్నించడం, 200 కి పైగా CCTV కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరికి బాధితురాలిని రచనా యాదవ్ అని గుర్తించారు, లఖేరి నది నుంచి ఆ మహిళ తల బయటపడింది. ఆమె ఝాన్సీకి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న టికమ్‌గఢ్‌కు చెందిన వితంతువు. ఆగస్టు 8న, నిందితులు రచనను గొంతు కోసి చంపి, ఆమె మృతదేహాన్ని బావికి తరలించి, సాక్ష్యాలను దాచడానికి ముక్కలు ముక్కలు చేశారు. ఈ ఘటనలో  మాజీ గ్రామపెద్ద, అతని మేనల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

Also Read :  ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. భార్యను రెండో పెళ్లి చేసుకున్న సీఐ!

Advertisment
తాజా కథనాలు