/rtv/media/media_files/2025/08/16/khajana-jewellery-2025-08-16-20-15-30.jpg)
Khajana Jewellery
హైదరాబాద్(Hyderabad) చందానగర్లోని ఖజానా జ్యువెలరీ(Khajana Jewelry) దోపిడీ సంచలనం సృష్టించింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి నాటు తుపాకులు, బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వినీత్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద 20 రోజులు రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. దోపిడీకి మొత్తం ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
Khazana Jewellers Gunfire Incident
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 13, 2025
సీసీటీవీ ఫుటేజ్
చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్లో దొంగతనం జరిగింది ఇలా!
షాపు తెరిచిన కొన్ని నిమిషాల్లోనే లోనికి చొరబడి, కాల్పులు జరిపి..
5 నిమిషాల వ్యవధిలోనే చోరీకి పాల్పడి ఉడాయించిన దుండగులు#KhazanaJewellers#Hyderabad#Telangana… pic.twitter.com/hAs329uTJI
Also Read : TPCC సంచలన వ్యాఖ్యలు.. క్రమశిక్షణ కమిటీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వ్యవహారం
Robbery At Khajana Jewelry
బైకులపై వచ్చి దోపిడీ చేసి, మళ్లీ బైకులపైనే పరారయ్యారని డీసీపీ వినీత్ తెలిపారు. నకిలీ నంబర్ ప్లేట్లతో వచ్చి చోరీకి పాల్పడి.. ఆ తర్వాత వాటిని మార్చుకున్నారట. హైదరాబాద్ నగర శివారులో భద్రతాసిబ్బంది ఎక్కువగా లేని దుకాణాన్ని ఎంచుకొని దోపిడీకి పాల్పడ్డారు. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులతో పరారయ్యారు. ఈ ముఠా గతంలో కోల్కతా, బిహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
🟥 Breaking News
— Telangana365 (@Telangana365) August 12, 2025
పట్టపగలు ఖజానా జ్యూలియరీలో దోపిడీకి యత్నించి సిబ్బంది పై కాల్పులు జరిపిన దొంగలు
ఖజానా షోరూం కు చేరుకున్న సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన సీపీ...
కాల్పుల ఘటనపై సిబ్బందిని అడిగి తెలుసుకున్న సిపి.
దుండగులను పట్టుకోవడానికి… pic.twitter.com/oDYauRvyib
Also Read : పల్సర్ బైక్ కొనివ్వలేదని .. కన్నతండ్రిపైనే కొడుకు హ*త్యాయత్నం
రెండేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ బిహార్ ముఠా హైదరాబాద్లో చేసిన తొలి చోరీ ఇది. ఇతర రాష్ట్రాల కూలీలను నియమించుకునేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కూలీలకు ఏమైనా నేర చరిత్ర ఉందా? అని ఆరా తీయాలి. లేబర్ సప్లయ్ ఏజెన్సీలు తమ వద్దకు వస్తున్న వారి వివరాలు మాకు ఇస్తే బాగుంటుంది’’ అని వినీత్ తెలిపారు.
పరారీలో ఉన్న మిగతా ఐదుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ముఠాపై గతంలో బీహార్, కోల్కతా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలతో సహా పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీ ఘటన తర్వాత పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
హైదరాబాద్ - చందానగర్ ఖజానా జువెలర్స్లో గన్ ఫైర్
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025
పట్టపగలే ఖజానా జువెలర్స్లో చొరబడిన ఆరుగురు దుండగులు
గన్తో బెదిరించి లాకర్ కీస్ అడిగిన గ్యాంగ్.. ఇవ్వకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ కాలుపై కాల్పులు
సీసీ కెమెరాలపై ఫైర్ చేసి, బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టిన దుండగులు… https://t.co/gszcvvSxDwpic.twitter.com/TVji4PwYrn