ఈ మధ్య కాలంలో ఆస్తులు, డబ్బు కోసం సొంత మనుషులనే హతమార్చిన ఘటనలు పెరిగిపోతున్నాయి. వయస్సు, బంధుత్వాలు చూడకుండా మనుషులను చంపేస్తున్నారు. తాత్కాలిక సుఖాల కోసం మన అనుకున్న మనుషులనే గోతిలోకి ముంచేస్తున్నారు. ఆస్తికి, డబ్బుకి ఇచ్చిన విలువ సొంత మనుషులకు ఇవ్వడం లేదు. అమ్మ, నాన్న, అన్న ఇలా ఏ బంధానికి కూడా విలువ ఇవ్వకుండా చంపేస్తున్నారు. కేవలం ఆస్తి, డబ్బు అనే కాకుండా పగ, ఈర్ష్య వంటి ఇతర కారణాలతో కూడా సొంత మనుషులను హతమారుస్తున్నారు. ఇది కూడా చూడండి: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు కోసం.. తాజాగా పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం సొంత సోదరులనే ఓ సోదరి హత్య చేసింది. నకరికల్లు యానాది కాలనీలో కృష్ణవేణి ఉంటుంది. ఈమెకు ఇద్దర సోదరులు ఉన్నారు. అయితే కృష్ణవేణికి పెళ్లి అయ్యింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల భర్తతో విడిపోయి సోదరుల ఇంట్లోనే ఉంటుంది. వీరి తండ్రి ప్రభుత్వ ఉద్యోగస్తుడు. పక్షవాతంతో మరణించడంతో ప్రభుత్వం నుంచి డబ్బులు కోసం ముగ్గురి మధ్య రోజూ తగాదాలు జరుగుతున్నాయి. ఇది కూడా చూడండి: 'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్ అనారోగ్యంతో ఉన్నప్పుడు కృష్ణవేణి చూసుకుందని, ఆ డబ్బులు తనకే చెందాలనుకుంది. దీంతో ఇద్దరు అన్నలను కూడా కృష్ణవేణి హత్య చేసింది. పెద్ద అన్నకు ఎక్కువగా మద్యం సేవించి చున్నీ మెడకు బిగించి హత్య చేసింది. చిన్న అన్నను కాలువలో తోసేసి హత్య చేసింది. పెద్ద అన్న ప్రభుత్వ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి డ్యూటీకి వెళ్లకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు ఇది కూడా చూడండి: పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!