TG High Court : మాగంటి గోపీనాథ్ పై దాఖలైన పిటిషన్లు క్లోజ్

మాగంటి గోపీనాథ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించింది. నామినేషన్‌ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో గోపీనాథ్‌  తప్పుడు సమాచారం ఇచ్చారంటూ  కాంగ్రెస్‌ నేత అజహరుద్దీన్‌, నవీన్‌ యాదవ్‌ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లుగా దాఖలు చేశారు.

New Update
maganti close

జూబ్లీహిల్స్‌ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించింది. 2023లో నామినేషన్‌ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో గోపీనాథ్‌  తప్పుడు సమాచారం ఇచ్చారంటూ  కాంగ్రెస్‌ నేత అజహరుద్దీన్‌, నవీన్‌ యాదవ్‌ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లుగా దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అనారోగ్య సమస్యలతో  కన్నుమూశారు. అయన  మృతి చెందిన విషయాన్ని ఆయన తరుపు  న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల పిటిషన్లపై విచారణ ముగిస్తున్నట్టుగా ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. 

చికిత్స పొందతూ కన్నుమూత

మాగంటి గోపీనాథ్ జూన్ 8వ తేదీ ఉదయం 5గంటలకు కన్నుమూశారు. గురువారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని AIG ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా మాగంటి వెంటిలేటర్ పై చికిత్స పొందతూ  తుదిశ్వాస విడిచారు. ఆయన 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్తానం మొదలైంది. 2018లో టీఆర్ఎస్‌లో చేరారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు.

1983లో టీడీపీతో మాగంటి రాజకీయాల్లోకి వచ్చారు. 1985 - 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1987, 1988లో హుడా డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు