/rtv/media/media_files/2025/04/29/1bsS6yCsKRZMc8Gncn9T.jpg)
road accident Nellore
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్ కోసం ఆటోలో కూలీలు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ప్రమాద జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని వెంనటే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు
మహారాష్ట్రకు చెందిన వారు..
ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన పెళ్లిబృందానికి జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి రుద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వరుడితో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. వివరాల ప్రకారం నాందేడ్కు చెందిన యువకునికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది.
ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!
ఈ క్రమంలో బుధవారం రాత్రి పెళ్లి బృందం నాందేడ్ నుంచి హుజురాబాద్ బయలుదేరింది. అయితే వారు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి రుద్ర మరణించగా పెళ్లికుమారుడితో పాటు ఆరుగురికి గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Operation Kagar : చత్తీస్ గఢ్ రాష్ట్రం లో మరో భారీ ఎన్ కౌంటర్...అగ్రనేత మృతి ?
కాగా ప్రమాదంలో వరుడు గాయపడటంతో వివాహం ఆగిపోయింది. మరోవైపు చిన్నారి మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. ఘనంగా జరగాల్సిన పెళ్లి వాయిదా పడటంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు