నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై మహిళను కారు ఢీకొట్టడంతో స్పాట్లోనే మృతి చెందింది. హైవేపై రోడ్డు దాటడానికి నలుగురు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో రోడ్డు పక్కన నిల్చోని ఉన్న నలుగురు మహిళల్లో ఒకరు స్పాట్లోనే మృతి చెందారు. మిగతా ముగ్గురు మహిళలు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆమె గోవిందపల్లెకు చెందిన వారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
ముంబై హైవేపై..
ఇదిలా ఉండగా ఇటీవల మహారాష్ట్ర పూణే జిల్లాలో ముంబై-పుణే ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. దాదాపు 16 మంది గాయపడ్డారు. శనివారం సాయంత్రం ముంబై-పుణే ఎక్స్ప్రెస్వేలోని టన్నల్ ఎంట్రీ ఈ ప్రమాదం జరిగింది. హైవేలోని లోనావాలా-ఖండాల ఘాట్ వద్ద కంటైనర్ వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
అదుపుతప్పిన ఆ కంటైనర్ ముందున్న ఒక వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మందున్న పలు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. పలు కార్లతో సహా సుమారు 20 వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా సుమారు 16 మంది గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్లలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ఎక్స్ప్రెస్వే పలు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి.
ఇది కూడా చూడండి: Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, ఎమర్జెన్సీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ధ్వంసమైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. ట్రాఫిక్ జామ్ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చాలా శ్రమించారు.
ఇది కూడా చూడండి: AIDS Test : పెళ్లికి ముందు HIV టెస్టు తప్పనిసరి.. మంత్రి సంచలన ప్రకటన