/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-50-2.jpg)
mumbai crime
Mumbai: ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజురోజుకీ మనుషులు మృగాలుగా తయారు అవుతున్నారు. వయస్సు, వరస చూడకుండా పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి మీద కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ముంబైలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని దిందోషి పోలీస్ స్టేషన్ పరిధిలో 78 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్
నిద్రిస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్నా..
దీంతో ఓ 20 ఏళ్ల యువకుడు ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసి పారిపోయాడు. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను కుటుంబ సభ్యులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 64(1), 332(బీ) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
ఇది కూడా చూడండి: USA: స్ట్రిక్ట్ గా అక్రమ వలసల చట్టం అమలు..పార్ట్ టైమ్ జాబ్ చేస్తే ఇంటికే..
ఇదిలా ఉండగా.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లిలోను ఓ దారుణ ఘటన జరిగింది. ప్రియుడిపై మోజు పెంచుకున్న ఓ ఇల్లాలు భర్తను దారుణంగా చంపింది. బాన్సువాడలోని బ్యాండ్ మేళం యజమాని నాగరాజు దగ్గర మైసయ్య అనే పని చేస్తున్నాడు. నాగరాజుకు మైసయ్య భార్యతో పరిచయం ఏర్పడింది. ఇది చివరకు... వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో మైసయ్య భార్యను మందలించడంతో దారుణానికి పాల్పడింది.
ఇది కూడా చూడండి: Republic Day 2025: జాతీయ జెండా ఆవిష్కరించేవాళ్లు ఇవి గుర్తుంచుకోండి!
భర్త అడ్డు తొలగించుకోవాలని ఓ ప్లాన్ వేసింది. అనారోగ్యంతో బాధ పడుతున్న భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి గతనెల తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆమె మాత్రమే ఒంటరిగా రావడంతో ప్రశ్నించారు. దీంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు వెళ్లాడని సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఆమె కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: Vijaysai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా