Crime News: బిడ్డ ప్రాణం తీసిన బీడీ ముక్క.. తండ్రి కాల్చిపడేయడంతో..!

తండ్రి కాల్చి పడేసిన బీడీముక్క 10 నెలల పసిబిడ్డ ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. లక్ష్మీదేవి భర్త బీడీ కాల్చి చివరిముక్క పడేశాడు. దాన్ని తమ బిడ్డ నోట్లో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుని మృతి చెందాడు.

New Update
Mangalore 10 month old baby dies after swallowing beedi

Mangalore 10 month old baby dies after swallowing beedi

అభం శుభం తెలియని 10 నెలల పదికందు బీడీ ముక్కకు బలైంది. తండ్రి కాల్చి పడేసిన చివరిముక్కను నోట్లో పెట్టుకుని ప్రాణం వదిలింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: 1941, 2025 క్యాలెండర్ సేమ్‌ టు సేమ్.. అప్పుడు యుద్ధాలే ఇప్పుడు యుద్ధాలే !

గొంతులో ఇరుక్కొవడంతో

కర్ణాటకలోని మంగళూరు నగర శివారు అడ్యార్‌లో బిహార్‌కు చెందిన లక్ష్మీదేవి కుటుంబం నివాసముంటోంది. రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిన్న (మంగళవారం) ఉదయం లక్ష్మీదేవి భర్త రోజులాగే బీడీ కాల్చి చివరి ముక్కను పడేశాడు. 

Also Read: 48 గంటల్లో 9 విమానాల్లో సమస్యలు.. ఎయిర్ ఇండియాకు అసలేమైంది?

అది చూసిన తమ అనీశ్‌కుమార్‌ (10 నెలల కుమారుడు) దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అది కాస్త గొంతులోకి పోయి ఇరుక్కుంది. బయటకు రాక.. లోపలకి వెళ్లకపోవడంతో ఆ బాలుడు చాలా ఇబ్బందిపడ్డాడు. అది గమనించిన తల్లిదండ్రులు ఇరుక్కున్న బీడీ ముక్కను బయటకు తీసేందుకు సతవిధాలా ప్రయత్నించారు. 

Also Read: కర్ణాటకలో దారుణం.. కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఓ తల్లి ఇనుప కడ్డీతో..

కానీ రాకపోవడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ గొంతులో ఇరుక్కున్న బీడీ ముక్కను బయటకు తీసేలోపే ఆ 10 నెలల పసికందు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Also Read :  కోర్టు ఆగ్రహానికి గురైన కన్నప్ప సినిమా.. సెన్సార్ లేకుండానే విడుదలపై సందేహాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు