/rtv/media/media_files/2025/04/10/Mq9RmPQ0PVCg32iBkpKG.jpg)
kuwait Photograph: (kuwait)
జీవనం కోసం కువైట్ వెళ్లిన మహిళపై అక్కడ యజమానులు యాసిడ్ దాడి చేశారు. జీతం అడిగినందుకు.. ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త మృతి చెందారు. దీంతో ఉపాధి కోసం ఆ మహిళ రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా కువైట్కి వెళ్లింది.
ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
నెల వేతనం ఎందుకు తక్కువ ఇచ్చారని..
అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తే.. నెలకు 150 దీనార్లు వేతనం ఇవ్వడానికి ఒప్పందం పెట్టుకున్నారు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత యజమానులు కేవలం 100 దీనార్లు వేతనం మాత్రమే ఇవ్వడంతో లక్ష్మి వారిని ప్రశ్నించింది. దీంతో యాజమానులు ఆగ్రహంతో ఆమెపై యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ ఘటన జరిగి పది రోజులు అవుతుంది.
ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
బాధితురాలు ఆసుపత్రి యాజమాన్యానికి జరిగిన విషయం చెప్పడంతో తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెతో ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు చేయించారు. అయితే కేసు వెనక్కి తీసుకుంటేనే ఫాస్పోర్టు ఇస్తామని అంటున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదని, ప్రభుత్వం స్పందించి లక్ష్మిని సొంత గ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.
ఇది కూడా చూడండి: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం